YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం తెలంగాణ

పత్తి కొనుగోళ్లు సజావుగా సాగాలి

పత్తి కొనుగోళ్లు సజావుగా సాగాలి

హైదరాబాద్ ఆగష్టు 21
2020 - 21 కి సంబంధించి పత్తి కొనుగోళ్లపై అధికారులు, జిన్నింగ్ మిల్లుల యాజమాన్యాలతో జరిగిన సమావేశంలో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి,  సీసీఐ సీఎండీ ప్రదీప్ కుమార్ అగర్వాల్, వ్యవసాయ శాఖ కార్యదర్శి జనార్దన్ రెడ్డి పాల్గోన్నారు. మంత్రి మాట్లాడుతూ పత్తి కొనుగోళ్లు సజావుగా సాగాలి.  దేశంలో పత్తి ఉత్పత్తిలో తెలంగాణది మూడోస్థానం.  గత ఏడాది మాదిరిగా ఈ ఏడాది తెలంగాణల మొత్తం పత్తి పంట మద్దతు ధరకు కొనుగోలుకు సీసీఐ సీఎండీ ప్రదీప్ కుమార్ అగర్వాల్ హామీ ఇచ్చారు, - 21 శాతం ఉత్పత్తితో గుజరాత్, మహారాష్ట్రల తర్వాత స్థానం.  దేశంలో పత్తి విత్తనాల విలువ సుమారు రూ.2500 కోట్లు కాగా, పత్తి ఉత్పత్తి విలువ రూ.68000 కోట్లు వుంటుంది.  ఈసారి వానాకాలంలో రాష్ట్రంలో 58.69 లక్షల ఎకరాలలో పత్తి సాగవుతుంది .. గత ఏడాదికన్నా ఎక్కువ ఉత్పత్తి వస్తుంది.  2019 - 20 సవంత్సరంలో సీసీఐ రూ.11749 కోట్ల విలువైన 21 లక్షల మెట్రిక్ టన్నుల పత్తి కొనుగోలు చేసింది.  పత్తి కనీస మద్దతుధర రూ.5825 బహిరంగ మార్కెట్ కన్నా ఎక్కువ ఉన్నందున పత్తి కొనుగోలు పరిమాణం పెంచాలని సీసీఐకి విజ్ఞప్తి
చేసారు.
 ప్రభుత్వ నియంత్రిత వ్యవసాయానికి కట్టుబడి రైతులు పత్తి సాగుచేసిన నేపథ్యంలో వారికి మంచి రాబడి ఇప్పించుటలో రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత రెట్టింపు అయింది.  2020 - 21 లో మద్దతుధరకు పత్తి కొనుగోలుకు గాను రాష్ట్రంలోని 314 జిన్నింగ్ మిల్లులను పత్తి కొనుగోలు కేంద్రాలుగా ప్రకటించేందుకు తగిన చర్యలు తీసుకోవాలి.  జిన్నింగ్ మిల్లుల యాజమాన్యాల జీఎస్టీ సమస్యపై సీసీఐ బాధ్యత తీసుకుని కేంద్రప్రభుత్వంతో సంప్రదించి పరిష్కరించాలి.  ప్రస్తుతం గోదాములలో ఉన్న పత్తి బేళ్లను ఇతర ప్రదేశాలకు తరలించి కొత్త నిల్వలకు వెంటనే అవకాశం కల్పించాలి.  సీసీఐ నిబంధనల ప్రకారం పత్తిలో తేమ 8 నుండి 12 శాతం ఉండేలా అధికారులు రైతులను చైతన్య పరచాలి.  పోయినసారి తెలంగాణ దేశంలో  పత్తి కొనుగోళ్లలో ప్రథమస్థానంలో నిలిచింది ..గత ఏడాది మాదిరిగానే జిన్నింగ్ మిల్స్ అసోసియేషన్ ఈసారి పత్తి కొనుగోళ్లకు సహకరించాలని మంత్రి కోరారు.
జిన్నింగ్ మిల్లుల సమస్యలు ముఖ్యమంత్రి కేసీఆర్  దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడం జరుగుతుంది .. గతంలో ముఖ్యమంత్రి  గారు అంగీకరించిన ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ (సబ్సిడీ)  దశలవారీగా విడుదలకు  కృషి చేస్తాం.  గత ఏడాది సీసీఐ పత్తి కొనుగోళ్లకు ప్రణాళికాబద్దంగా సహకరించిన మంత్రివర్యులు మరియు తెలంగాణ మార్కెటింగ్ శాఖకు సీసీఐ సీఎండీకి మంత్రి  ధన్యవాదాలు తెలిపారు.

Related Posts