YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

కరోనా తో రాష్ట్ర ఆదాయ తగ్గినా సంక్షేమం ఆగదు

కరోనా తో రాష్ట్ర ఆదాయ తగ్గినా సంక్షేమం ఆగదు

సంగారెడ్డి ఆగష్టు 21

కరోనా తో రాష్ట్ర ఆదాయ తగ్గినా సంక్షేమం ఆగదు  రెండు కోట్లతో  అందోల్- జోగిపేట టౌన్ హాల్ కు శంకుస్థాపన  320 డబల్ బెడ్ రూమ్ ఇండ్లను అర్హులైన నిరుపేదలకు అందించాలి  రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు  అందోల్ లో  కరోనా వల్ల రాష్ట్ర ఆదాయం తగ్గినా ప్రజా సంక్షేమ కా cర్యక్రమాలను ప్రభుత్వం ఆపలేదని ఆర్థిక మంత్రి హరీశ్ రావు  చెప్పారు.  శుక్రవారం ఆందో ల్ లో  రెండు కోట్లతో  నిర్మించనున్న  ఆందో ల్ - జోగిపేట టౌన్ హాలుకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం   మహిళలకు షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి చెక్కులను  అందజేశారు.ఈ సందర్భంగా మంత్రి  మాట్లాడుతూ ప్రభుత్వం కుల, మత బేధాలు లేకుండా  నిరుపేదలైన ఆడ పిల్లల వివాహానికి లక్ష నూట పదహార్లు ఆర్థిక సాయం అందిస్తోందన్నారు. దేశంలో మరే రాష్ట్రంలో ఇలాంటి పథకాన్ని అమలు చేయడం లేదన్నారు.ఒక్క తెలంగాణ రాష్ట్రం లో, సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో నే ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలు నడుస్తున్నాయన్నారు.  కరోనాతో ఆదాయం తగ్గినా ఈ ఒక్క నెలలోనే కళ్యాణ లక్ష్మి పథకం కింద 401 కోట్లు  చెల్లించామన్నారు. ఇటీవలే రైతు బంధు కింద 7400 కోట్లు సాయమందించామన్నారు. ఆసరా పెన్షన్లు రెండు వేల రూపాయలు సైతం అందిస్తున్నామన్నారు. ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ ఆధ్వర్యంలో అందోల్ లో  పలు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు. అందులో భాగంగా సభలు, సమావేశాలు, శుభ కార్యాలకు వినియోగించేందుకు గాను రెండు కోట్లతో టౌన్ హాల్ నిర్మిస్తున్నట్లు మంత్రి చెప్పారు. స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ తో ఈ నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు.  అవసరం అయితే మరిన్ని నిధులు కేటాయించి టౌన్ హాలును అన్ని హంగులతో నిర్మిస్తామన్నారు.  ఆందో ల్ లో 320 డబుల్ బెడ్ రూం ల నిర్మాణం పూర్తయిందన్నారు. అర్హులైన నిరు పేదల నుంచి దరఖాస్తులు స్వీకరించాలని జిల్లా కలెక్టర్ హనుమంతరావుకు మంత్రి  ఆదేశించారు. నిరుపేదల ఎంపిక పారదర్శకంగా జరగాలని సూచించారు. కోటీ 20 లక్షల తో డ్రైన్లు ఇతర సదుపాయాలు కల్పిస్తామన్నారు. జోగిపేటలోనూ డబుల్ బెడ్ రూంల నిర్మాణం జరుగుతుందని, త్వరలోనే  అర్హులను గుర్తించి  వాటిని ఇస్తామన్నారు.  ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే క్రాంతి కిరణ్, ఎంపీ బీబీ పాటిల్, జెడ్ పి ఛైర్మన్ మంజుశ్రీ జయపాల్ రెడ్జి , కలెక్టర్ హనుమంతరావు, డీసీసీబీ ఛైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Related Posts