YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు ఆంధ్ర ప్రదేశ్

ఫోన్ ట్యాపింగ్ 16 మందికి నోటీసులు

ఫోన్ ట్యాపింగ్ 16 మందికి నోటీసులు

విజయవాడ, ఆగస్టు 21
ఆంధ్రప్రదేశ్‌లో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ప్రకంపణలు రేపుతోంది. ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై ఏపీ హైకోర్టు సీరియస్ అయింది. ఈ కేసుకు సంబంధించి 16 మందికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. సీబీఐ,  రిలయన్స్, జియో, వోడాఫోన్, ఎయిర్‌టెల్, బీఎస్‌ఎన్‌ఎల్, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ అసోషియేషన్ అధ్యక్షుడికి హైకోర్టు నోటీసులిచ్చింది. వ్యక్తిగతంగా లేదా న్యాయవాది ద్వారా హాజరు కావాలని హైకోర్టు
ఆదేశాలు జారీ చేసింది. దీనికి సంబంధించి నాలుగు వారాల్లో సమాధానాలు పంపాలని హైకోర్టు ఆదేశించింది.న్యాయమూర్తుల ఫోన్లపై నిఘా పెట్టారంటూ పలు కొన్ని పత్రికలు, టీవీ ఛానళ్లలో వర్తలు ప్రసారమైన  నేపథ్యంలో ఈ వ్యవహారంపై ప్రత్యేక దర్యాప్తు జరిపించాలని హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్‌) దాఖలైంది. విశాఖ జిల్లా గోపాలపట్నానికి చెందిన న్యాయవాది నక్కా నిమ్మీగ్రేస్‌ సోమవారం పిల్‌ దాఖలు
చేశారు. ప్రభుత్వంలోని రాజకీయ పెద్దల ప్రోద్బలంతో న్యాయ వ్యవస్థ ప్రతిష్టకు కళంకం తెచ్చేలా వ్యవహరించారని పిటిషనర్ ఆరోపించారు.హైకోర్టు న్యాయమూర్తుల ఫోన్ల ట్యాపింగ్‌, ట్రాకింగ్‌, నిఘా  తదితరాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హోంశాఖ ముఖ్యకార్యదర్శి, డీజీపీల వ్యవహారంపై సీబీఐ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) ఏర్పాటు చేసి, దర్యాప్తు చేయించాలని.. నిబంధనల  ఉల్లంఘనలకు పాల్పడిన అధికారులను బాధ్యులను చేసేలా ఆదేశాలు జారీ చేయాలని పిటిషన్ అభ్యర్థించారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు ధర్మాసనం.. సీబీఐ, జియో, ఎయిల్‌టెల్ ప్రతినిధులు సహా 16  మందికి నోటీసులు జారీ చేసింది.

Related Posts