YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

కేరళ ప్రభుత్వంపై అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానం

కేరళ ప్రభుత్వంపై అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానం

తిరువనంతపురం ఆగస్టు 24, 
కేరళలో ఒక రోజు ప్రత్యేక అసెంబ్లీ సమావేశం సోమవారం ప్రారంభమైంది. సీఎం పినరయి విజయన్ ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది. కాంగ్రెస్ ఎమ్మెల్యే వీడీ సతీసన్ అవిశ్వాస తీర్మానాన్ని పెట్టగా దీనిపై చర్చకు స్పీకర్ అనుమతించారు. దీంతో ఆయన చర్చను ప్రారంభించారు.రాష్ట్రంలోని బంగారు స్మగ్లింగ్ మాఫియా తమ కార్యకలాపాలను నిర్వహించుకునేందుకు ముఖ్యమంత్రి కార్యాలయాన్ని వినియోగించుకుంటుందని సతీసన్ ఆరోపించారు. మరోవైపు బంగారం స్మగ్లింగ్ కేసుతో స్పీకర్‌కు సంబంధాలున్నాయని అసెంబ్లీలో ప్రతిపక్ష నేత రమేష్ చెన్నితాలా ఆరోపించారు. ప్రభుత్వంతోపాటు ఆయనకు వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టినందున స్పీకర్ ఆ కుర్చీలో కూర్చోకూడదని అన్నారు. అయితే నిబంధనల ప్రకారం దీని కోసం 14 రోజులు ముందుగా నోటీసు ఇవ్వాలని, అప్పుడే ఈ తీర్మానానికి సమ్మతిస్తానని స్పీకర్ చెప్పారు.కాగా, దీనికి ముందు త్రివేండ్రం అంతర్జాతీయ విమానాశ్రయం కార్యకలాపాలు, పర్యవేక్షణను ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యానికి అప్పగిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై పున:సమీక్షించాలని కోరుతూ సీఎం పినరయి విజయన్ అసెంబ్లీలో ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అనంతరం ప్రభుత్వంపై కాంగ్రెస్ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ కొనసాగింది.

Related Posts