న్యూ ఢిల్లీ ఆగస్టు 24,
కాంగ్రెస్ పార్టీకి కొత్త రథసారథి కావాలంటూ 26 మంది సీనియర్ పార్టీ నేతలు రాసిన లేఖ పట్ల రాహుల్ గాంధీ సీరియస్గా రియాక్ట్ అయ్యారు. ధిక్కార స్వరం వినిపించిన సీనియర్లపై ఆయన విరుచుకుపడ్డారు. పాలిత బీజేపీతో జతకట్టిన ఆ నేతలంతా కుట్ర పన్నినట్లు ఆయన ఆరోపించారు. ఏఐసీసీ అధ్యక్ష పదవిపై తనకు ఆసక్తి లేదని సోనియా గాంధీ వెల్లడించిన నేపథ్యంలో.. రాహుల్ ఘాటుగా స్పందించారు. బీజేపీతో రెబల్స్ జోడీకట్టినట్లు మాజీ ప్రధాని మన్మోహన్ వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో రాహుల్ తీవ్రంగా వ్యాఖ్ెలు చేశారు. కాంగ్రెస్ పార్టీ బలహీనంగా ఉన్న సమయంలో, మధ్యప్రదేశ్-రాజస్థాన్ రాష్ట్రాల్లో సంక్షోభం ఉన్న సమయంలో, సోనియా గాంధీ ఆరోగ్యం సరిగా లేని సమయంలో ఎందుకు సీనియర్లు ధిక్కార స్వరాన్ని వినిపిస్తున్నారని రాహుల్ ప్రశ్నించారు. ఎందు కోసం ఆ సీనియర్లు ఆ లేఖ రాశారాని నిలదీశారు. ఆ లేఖ తన తల్లిని ఎంతో క్షోభకు గురి చేసిందన్నారు.