మహాబూబ్ నగర్ ఆగస్టు 24,
ముఖ్యమంత్రి ప్రజలకు ఇచ్చిన హామీలను మరిచిపోయారని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్ రెడ్డి అన్నారు.. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఆర్ అండ్ బి అతిధి గృహంలో టీడీపీ రాష్ట్ర నాయకులతో ఆయన సమావేశం నిర్వహించారు .ఈ కార్యక్రమనికి మక్తల్ మాజీ ఎమ్మెల్యే సీత దయాకర్ రెడ్డి టి.అశోక్ తదితరులు హాజరయ్యారు.. అనంతరం మహబూబ్ నగర్ జిల్లా కాలెక్టర్ కు వినితి పత్రం అందజేశారు...ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఫలితాలకు మువదు మూడు ఎకరాల భూమి ఇస్తామని చెప్పి మోసం చేసారని మండిపడ్డారు. తెలంగాణ రాష్టంలో 33 శాతం దళితులు ఉన్నారని వారి ఓట్ల కోసం మాత్రమే వారికి హామీలు ఇచ్చారని దళితులకు ఎలాంటి న్యాయం చేయలేదన్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న దళితులకు ఇప్పటి వరకు ఎంత మందికి 3 ఎకరాల భూమి మరియు సొంత భూమి ఉంటే ఇల్లు కట్టుకోవడను 5 లక్షల రూపాయలు ఇచ్చారో చెప్పాలన్నారు...దళితులకు న్యాయం జేరుగుతుందంటే తమ పార్టీ ప్రభుత్వానికి సహకరిస్తామన్నారు.. ప్రభుత్వం వెంటనే నిరుద్యోగ దళితులకు ఉద్యోగులు ఇచ్చి దళితులను అదుకోవలన్నారు..