ఆగస్టు 24,
ఎల్కపల్లి గ్రామ ఆడపిల్లలకు అండగా ఎమ్మెల్యే కోనేరు కోనప్ప సొంత ఖర్చులతో వారి ఇళ్లు నిర్మించనున్న ఎమ్మెల్యే.. ఆసిఫాబాద్ ఆపదలో ఉన్నవారికి ఆపన్నహస్తం అందించడంలో ముందుండే ఎమ్మెల్యే కోనేరు కోనప్ప మరోసారి తన మంచిమనసు చాటుకున్నారు.. పెంచికలపేట్ మండలం ఎల్కపెల్లి గ్రామానికి చెందిన రాజం-రాజ్యలక్ష్మి దంపతులకు ఆరుగురు అమ్మాయిలు.. రాజం గతేడాది అనారోగ్యంతో మరణించగా అతని సతీమణి రాజ్యలక్ష్మి ఇటీవలే అనారోగ్యంతో మరణించింది.. తల్లిదండ్రులిద్దరు మరణించడంతో పిల్లలు దిక్కుతోచని స్థితిలో సహాయం కోసం ఎదురుచూస్తున్నారు... స్థానిక నాయకుల ద్వారా విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఆ ఆడబిడ్డలకు అండగా నిలిచారు.. ఈరోజు వారి గ్రామంలో ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఆదేశాల మేరకు ఇంటి నిర్మాణం కోసం కోనేరు ఛారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కోనేరు వంశీ భూమిపూజ చేశారు.. మరియు వారికి కావాల్సిన సామాగ్రిని అందజేశారు... ప్రభుత్వ పరంగా కూడా అన్నివిధాలా సహాయ సహకారాలు అందజేస్తామని,మంత్రి కెటీఆర్ కూడా వీరి సమస్యపై సత్వరమే స్పందించి సహాయ సహకారాలు అందించినందుకు కృతజ్ఞతలు తెలిపారు...