YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

వరదలతో ప్రజలు అల్లాడుతున్నారు: టీడీపీ అధినేత చంద్రబాబు

వరదలతో ప్రజలు అల్లాడుతున్నారు: టీడీపీ అధినేత చంద్రబాబు

అమరావతి ఆగష్టు 24 
వరదలతో ప్రజలు అల్లాడుతున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు తెలిపారు. వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమయిందని తప్పుబట్టారు. ప్రభుత్వ చేతకానితనం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని, పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయని తెలిపారు. టీడీపీ హయాంలో తుఫాన్‌ బాధితులను అన్ని విధాలా ఆదుకున్నామని, వరద సాయం కింద ఒక్కో కుటుంబానికి రూ.10 వేలు ఇవ్వాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. గత ఏడాది హామీ ఇచ్చిన రూ.5 వేలు ఇవ్వాలని, మెడికల్ క్యాంపులు నిర్వహించాలని చంద్రబాబు సూచించారు. పేదలకు సాయం చేయాల్సి సమయంలోనూ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఏపీలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయన్నారు. డాక్టర్లకు కులాలను అంటగడుతున్నారని విమర్శించారు. సంక్షోభంలో రాష్ట్రాన్ని గట్టెక్కించే నాయకత్వం కొరవడిందని చంద్రబాబు అన్నారు.

Related Posts