YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

మరోసారి కేసీఆర్, జగన్ భేటీ

మరోసారి కేసీఆర్, జగన్ భేటీ

విజయవాడ, ఆగస్టు 24
మరోసారి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం కానున్నారా?త్వరలోనే ఈ భేటీ జరగనుందా? ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్న నీటి వివాదాన్ని స్వయంగా సీఎంలే పరిష్కారం చేసుకోనున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జలవివాదం పరిష్కారమే ప్రధాన అజెండగా జగన్, కేసీఆర్ త్వరలో భేటీ కానున్నారని సమాచారం. తెలుగు రాష్ట్రాలకు చెందిన అధికార పార్టీ నేతలు పలువురు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీలో ఈనెల 25న జరగాల్సిన అపెక్స్ కౌన్సిల్ సమావేశం వాయిదా పడింది.దీంతో ఏపీ తెలంగాణ సీఎంలు ఈనెలాఖరులోపు సమావేశమై నీటివివాదాన్ని పరిష్కరించుకోవాలనుకుంటున్నారు. దీనికి సంబంధించి రెండు రాష్ట్రాల జలవనరుల శాఖ అధికారులు అజెండా కూడా సిద్ధం చేస్తున్నారు.నిజానికి ఈనెలలో ఈనెల 25న జరగాల్సిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలోనే జలవివాదాన్ని పరిష్కరించుకోవాలని రెండు రాష్ట్రాలు భావించాయి. అయితే వివిధ కారణాలతో ఇప్పటికే ఈ సమావేశం కాస్త రెండు సార్లు వాయిదా పడింది. తాజాగా ఆగష్టు 25న జరగాల్సిన భేటీ కాస్త... కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర షెకావత్‌కు కరోనా సోకడంతో మరోసారి వాయిదా పడింది. దీంతో జగన్ కేసీఆర్ భేటీ అయి ఈ వివాదాన్ని పరిష్కరించుకోవాలని నిర్ణయానికి వచ్చారు. ఈ భేటీకి సంబంధించి దాదాపు ముహుర్తం కూడా ఖరారు అయినట్లు సమాచారం. అన్నీ అనుకూలిస్తే.. ఈనెలాఖరులో ఇద్దరు సీఎంలు సమావేశం కానున్నారు.ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య కృష్ణా, గోదావరి జలాలతో పాటు కొత్త ప్రాజెక్టుల నిర్మాణం, రాయలసీమ ఎత్తిపోతల విషయంలోఅనేక వివాదాలు నడుస్తున్నాయి. ఏపీలో శ్రీశైలం జలాశయానికి సమీపంలో తలపెట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకంపై ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం రెండు సార్లు కృష్ణా నీటి యాజమాన్యం బోర్డుకుఫిర్యాదు చేసింది. అలాగే అపెక్స్ కౌన్సిల్‌కు కూడా లేఖ రాసింది. దీంతో కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ జోక్యం చేసుకొని ఇరు రాష్ట్రాల సీఎంలకు లేఖ రాసింది. త్వరలో జరిగే అపెక్స్ కౌన్సిల్‌కు హాజరు కావాలని తెలిపింది. అయితే రాయలసీమ ఎత్తిపోతల పథకం కొత్త ప్రాజెక్టు కాదని, విభజన చట్టంలో పొందుపరిచిందేనని ఏపీ తన వాదనను బలంగా వినిపిస్తోంది. మరోవైపు దీనిపై న్యాయ పోరాటం చేయాలని తెలంగాణ భావిస్తోంది.

Related Posts