YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు తెలంగాణ

కిడ్నాపర్ కు దేహశుద్ది

కిడ్నాపర్ కు దేహశుద్ది

నిజామాబాద్ ఆగస్టు 25, 
తల్లి కిమాయమాటలు చెప్పి ఏడాదిన్నర వయసున్న కొడుకును కిడ్నాప్ చేసిన ఘటన నిజామాబాద్ జిల్లాలో కలకలం రేపింది. రెండు వారాలు తర్వాత  నిందితున్ని గుర్తించిన బాధితురాలు అతన్ని పట్టుకుని దేహశుద్ది చేసింది. విషయం తెలుసుకున్న స్థానికులు కిడ్నాపర్ ను చెట్టుకు కట్టేసి చితకబాదారు..పోలీసులకు అప్పగించారు. రెంజల్ మండలం దండిగుట్టకు చెందిన లక్ష్మీ ఈ నెల 11న ఇంట్లో భర్త తో గొడవపడి కొడుకుతో సహా నిజామాబాద్ వచ్చింది. బస్టాండ్ లో ఉండగా బాసర కు చెందిన నాగరాజు అనే వ్యక్తి మాట మాట కాలిపి ఆమెకు కల్లుతాగించి మత్తులో దింపాడు. ఆ తర్వాత బాబు ను ఎత్తుకుని పరారయ్యాడు. మంగళవారం  ఉదయం కలెక్టరేట్ సమీపం లో నాగరాజు ను గుర్తించిన లక్ష్మి బంధువులకు సమాచారం అందించి పట్టుకుంది..అయితే బాబు విషయం తనకు తెలువదని ఎవరో ఎత్తుకు వెళ్లారని బుకాయించడం తో ఆగ్రహంతో దాడి చేశారు. నిందితున్ని ఆదువులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు

Related Posts