YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

పార్లమెంటులో హార్డ్‌ కాపీలు ఉండవు

పార్లమెంటులో హార్డ్‌ కాపీలు ఉండవు

న్యూఢిల్లీ ఆగష్టు 25 ఆగష్టు 25  
వచ్చేనెలలో జరగనున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో ఆర్డినెన్స్‌లకు సంబంధించి హార్డ్‌కాపీలను (కాగితాల రూపంలో) పంపిణీ చేయడం ఉండదని లోక్‌సభ సచివాలయం  తెలిపింది. ప్రభుత్వం గడిచిన ఆరునెలల్లో తెచ్చిన పలు ఆర్డినెన్స్‌లు ఆమోదం కోసం పార్లమెంటు ముందుకు రానున్నాయి. ఎంపీలకు భౌతికంగా కాగితాలు అందజేస్తే... కరోనా వ్యాప్తి చెందే అవకాశాలుంటాయి కాబట్టి సాఫ్ట్‌కాపీలను అందజేస్తామని లోక్‌సభ సచివాలయం సోమవారం ఒక ప్రకటనలో వివరించింది.

Related Posts