YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

కోవిడ్ నిబంధన మేరకు అసెంబ్లీ సమావేశాలు

కోవిడ్ నిబంధన మేరకు అసెంబ్లీ సమావేశాలు

నల్గోండ ఆగష్టు 25  
నల్గొండ పట్టణంలోని తన నివాసంలో  శాసనమండలి చైర్మన్  గుత్తా సుఖేందర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు.  అయన మాట్లాడుతూ వచ్చే నెల 7 నుంచి జరిగే అసెంబ్లీ   సమావేశాలు కోవిడ్ నిబంధనలు ప్రకారమే నిర్వహిస్తున్నాం. పకడ్బందీగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం ఎవ్వరికిఎలాంటి అనుమానాలు అవసరంలేదు.  ప్రతి ఒక్కరు భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకున్నామని అన్నారు. ఎంట్రెన్స్ లో ఆటో మేటిక్  ధర్మల్ స్క్రీనింగ్    మీటర్లు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు.
శ్రీశైలం పవర్ హౌస్  ఘటన దురదృష్టకరం.ఘటన జరిగిన వెంటనే విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి, జెన్కో సీఎండీ  ప్రభాకర్ రావు  అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.అభినందనీయం. అమరులైన విద్యుత్ శాఖ సిబ్బందికి శ్రద్ధాంజలి ఘటిస్తున్నాం. శ్రీశైలం పవర్ హౌస్ ఘటనలో చనిపోయిన వారి కుటుంబాలను  ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకుంటుందని ముఖ్యమంత్రి కేసీఆర్   ఇప్పటికే  ప్రకటించారని అయన గుర్తు చేసారు.

Related Posts