YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

జర్నలిస్టులకు అండగా నిలిచిన మంత్రి శంకరనారాయణ

జర్నలిస్టులకు అండగా నిలిచిన మంత్రి శంకరనారాయణ

అనంతపురం ఆగష్టు 25  
కరోనా నుంచి కోలుకుని 14 రోజుల పాటు హోమ్ ఐసోలేషన్ లో ఉండి తిరిగి తమ విధులు నిర్వహిస్తున్న ఎనిమిదిమంది విలేకరులకు మంత్రి శంకర్ నారాయణ అండగా నిలిచారు. అనంతపురంలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ నందు కరోనా బారిన పడి కోలుకున్న ఎనిమిదిమంది విలేకరులకు 50 కేజీల బియ్యం మరియు 5000/- రూపాయల నగదును అందించి తన దాతృత్వాన్ని చాటిన రాష్ట్ర రహదారులు మరియు భవనాల శాఖ మాత్యులు శ్రీ మాలగుండ్ల శంకర్ నారాయణ గారు. లాక్డౌన్ సమయంలో, కరోనా వ్యాధి విస్తృతంగా వ్యాపిస్తోన్న సమయంలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా చేసిన సేవలు ఘణనీయమని పేర్కొన్నారు. ప్రజల్లో ఈ వ్యాధి పట్ల అవగాహన తీసుకురావడంలో, అంతేకాకుండా ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందజేయడంలో తమ ప్రాణాలను కూడా లెక్కచేయకుండా పనిచేస్తున్న ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ విలేకరులకు మంత్రి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.

Related Posts