YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

నేరాలు దేశీయం

ఉత్తరాఖండ్ లో కీచక పోలీస్

ఉత్తరాఖండ్ లో కీచక పోలీస్

డెహ్రాడూన్,. ఆగస్టు 25 
కంచే చేను మేసిందన్న చందంగా ప్రవర్తించాడో కీచక పోలీస్ అధికారి. ఒంటరిగా కనిపించిన బాలికపై కామంతో రెచ్చిపోయాడు. అభంశుభం తెలియని పదకొండేళ్ల బాలికపై అమానుషంగా అత్యాచారం చేశాడు. బాత్రూమ్‌లో బంధించి దారుణంగా రేప్ చేశాడు. బాలిక తల్లి సడెన్‌గా రావడంతో కీచక పోలీస్ బాగోతం బట్టబయలైంది. ఈ దారుణ ఘటన ఉత్తరాఖండ్‌‌లోని డెహ్రాడూన్‌లో జరిగింది.డెహ్రాడూన్‌ గవర్నమెంట్ క్వార్టర్స్‌లో నివాసముంటున్న బాలిక(11) బాత్రూమ్‌కి అని చెప్పి వెళ్లింది. అదే క్వార్టర్స్‌లో నివాసముంటున్న ఎమర్జెన్సీ 112 హెల్ప్‌లైన్ సెంటర్‌ ఏఎస్సై సంజీవ్ జుగాడి బాలికపై కన్నేశాడు. ఆమె ఒంటరిగా కనిపించడంతో మృగాడిగా మారి రెచ్చిపోయాడు. బాలికని బాత్రూమ్‌లో బంధించాడు. లోపల నుంచి గడియపెట్టి దారుణంగా అత్యాచారం చేశాడు. పశువులా ఆమెపై పడి కామవాంఛలు తీర్చుకున్నాడు. బాత్రూమ్‌కి వెళ్లిన కూతురు ఎంతసేపటికీ తిరిగిరాలేదని అనుమానంతో తల్లి రావడంతో ఏఎస్సై కీచకపర్వం వెలుగుచూసింది.బాత్రూమ్ వద్దకెళ్లిన తల్లి బయటి నుంచి ఎంత పిలిచినా కూతురు పలకలేదు. లోపల నుంచి గడియ పెట్టి ఉండడంతో గట్టిగా పిలిచింది. కొద్దిసేపటికి ఏఎస్సై సంజీవ్ జాగుడి బాత్రూమ్‌లో నుంచి బయటికొచ్చి అక్కడి నుంచి పరారయ్యాడు. లోపలికి వెళ్లి చూడగా బాలిక అపస్మారక స్ధితిలో పడి ఉండడం చూసి తల్లి షాక్‌కి గురైంది. అత్యాచారానికి గురైన కూతురిని తీసుకుని ఇంటికెళ్లింది. ఆ విషయం స్థానికులకు విషయం తెలియడంతో పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే స్పెషల్ టీమ్ ఏర్పాటు చేసిన పోలీసులు పరారీలో ఉన్న ఏఎస్సైని అరెస్టు చేసి రిమాండ్‌కి తరలించారు.

Related Posts