YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

ఆ చిన్నారి మృత్యంజయుడు

ఆ చిన్నారి మృత్యంజయుడు

పూణే ఆగస్టు 26,
అంత పెద్ద ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డ ఆ చిన్నారిని మృత్యుంజయుడనే అనాలి. ప్రమాదం జరిగిన 18 గంటల తర్వాత ప్రాణాలతో బయటపడటం అంటే మూమూలు విషయమా..? అందుకే ఆ చిన్నారి ఇప్పుడు మీడియాలో, సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యి కూర్చున్నాడు. ఇంతకీ ఆ బాలుడు సోమవారం  రాత్రి మహారాష్ట్రలో ఐదంతస్తుల భవనం కుప్పకూలిన ఘటనలో బతికి బయటపడ్డాడు.  ఘటన జరిగిన 18గంటల తర్వాత శిథిలాల కింద చిక్కుకున్న బాలుడు ప్రాణాలతో సురక్షితంగా బయటపడ్డాడు. ఇది నిజంగా అద్భుతమేనని అంటున్నారు స్థానికులు. ఈ ఘటనలో ఇంకా అదృశ్యమైన మరికొందరు కూడా ప్రాణాలతో బయటపడాలని వారంతా ప్రార్ధనలు చేస్తున్నారు. మహారాష్ట్రలోని రాయ్గఢ్ జిల్లా మహద్ ప్రాంతంలో ఐదంతస్తుల భవనం కుప్పకూలిన ఘటన అంతులేని విషాదాన్ని నింపింది. ఈ ప్రమాదంలో 70మందికిపైగా శిథిలాల కింద చిక్కుకున్నారు. ఇప్పటికి  కొనసాగుతున్న సహాయక చర్యల్లో 60మందిని పైగా అధికారులు రక్షించారు. ప్రమాదంలో పదహారుమంది మరణించారు. మృతుల్లో ఏడుగురు మగవారు, తొమ్మిదిమంది మహిళలున్నారు.  

Related Posts