YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

చెక్కులు పంపిణి చేసిన ఎమ్మెల్యే సుంకే

చెక్కులు పంపిణి చేసిన ఎమ్మెల్యే సుంకే

కరీంనగర్ ఆగస్టు 26, 
చొప్పదండి మండలానికి చెందిన 39 లబ్దిదారులకు 41,04,756 రూపాయల విలువగల చెక్కులను చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే  మాట్లాడుతూ కళ్యాణలక్ష్మి, షాదిముభారక్ పథకం నిరుపేదలకు వరం అని, రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్  ప్రవేశపెట్టిన ఈ పథకం దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇప్పటి వరకు ప్రవేశపెట్టలేదని అన్నారు.  నిరుపేదలపై ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనం అని అన్నారు.  ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సుంకే రవిశంకర్, గ్రంథాలయ చైర్మన్ ఏనుగు రవీందర్ రెడ్డి, ఎంపిపి చిలక రవి,  మున్సిపల్ చైర్మన్ గుర్రం నీరజ,  మార్కెట్ కమిటీ చైర్మన్ చంద్రశేఖర్ గౌడ్,  మాజీ జెడ్పిటిసి కౌన్సిలర్లు సర్పంచులు ఎంపీటీసీలు అధికారులు పాల్గొన్నారు.

Related Posts