కరీంనగర్ ఆగస్టు 26,
చొప్పదండి మండలానికి చెందిన 39 లబ్దిదారులకు 41,04,756 రూపాయల విలువగల చెక్కులను చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కళ్యాణలక్ష్మి, షాదిముభారక్ పథకం నిరుపేదలకు వరం అని, రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన ఈ పథకం దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇప్పటి వరకు ప్రవేశపెట్టలేదని అన్నారు. నిరుపేదలపై ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనం అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సుంకే రవిశంకర్, గ్రంథాలయ చైర్మన్ ఏనుగు రవీందర్ రెడ్డి, ఎంపిపి చిలక రవి, మున్సిపల్ చైర్మన్ గుర్రం నీరజ, మార్కెట్ కమిటీ చైర్మన్ చంద్రశేఖర్ గౌడ్, మాజీ జెడ్పిటిసి కౌన్సిలర్లు సర్పంచులు ఎంపీటీసీలు అధికారులు పాల్గొన్నారు.