YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం విదేశీయం

ట్రంప్ చేతి మీదుగా... ఇండో అమెరికన్ సిటిజన్ షిప్

ట్రంప్  చేతి మీదుగా... ఇండో అమెరికన్ సిటిజన్ షిప్

వాషింగ్టన్, ఆగస్టు 26 
అమెరికా అధ్యక్ష భవనం శ్వేతసౌధం ఓ అరుదైన ఘట్టానికి సాక్ష్యంగా నిలిచింది. అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో విదేశీ ఓటర్లపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దృష్టి కేంద్రీకరించారు. ఈ నేపథ్యంలో ఐదు దేశాలకు చెందిన పౌరులకు అమెరికా పౌరసత్వాన్ని అందజేసే కార్యక్రమాన్ని ఆయన చేతులు మీదుగా మంగళవారం సాయంత్రం నిర్వహించారు. వీరిలో భారత్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ డెవలపర్ సుధా సుందరి నారాయణన్ కూడా ఉన్నారు. కుడి చేతిని పైకి ఎత్తి చూపుతూ, మరో చేత్తో అమెరికా జెండాను పట్టుకుని, తాము అమెరికా పౌరులమని సంప్రదాయ ప్రమాణాన్ని చేశారు.ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ.. దేశాన్ని, రంగును, మతాన్ని అమెరికా చూడబోదని చెప్పడానికి ఇంతకన్నా మంచి నిదర్శనం లేదని అన్నారు. అమెరికా ఓ అద్భుత దేశమని ప్రశంసలు కురిపించిన ట్రంప్.. ఇందుకు సంబంధించిన వీడియోను రిపబ్లికన్ నేషనల్ కన్వెన్షన్‌లో ప్రసారం చేయనున్నారు.భారత్, బొలీవియా, లెబనాన్, సూడాన్, ఘనా దేశాలకు చెందిన ఐదుగురు అమెరికా పౌరసత్వాన్ని స్వీకరించారు. ట్రంప్ పక్కనే నిలబడి ఉండగా.. హోమ్ లాండ్ సెక్యూరిటీ విభాగం కార్యదర్శి చాద్ వోల్ఫ్ వారితో ప్రమాణం చేయించారు. ఐదుగురు అసాధారణ వ్యక్తులను గొప్ప దేశమైన అమెరికా తన కుటుంబంలోకి నేడు సాదరంగా ఆహ్వానిస్తోంది... ఇప్పుడు దేవభూమి పౌరులుగా గుర్తింపు పొందిన వారికి శుభాకాంక్షలని ట్రంప్ వ్యాఖ్యానించారు. కొత్తగా అమెరికా పౌరసత్వం స్వీకరించిన పౌరులు.. దేశ చరిత్రను తెలుసుకుని, నిబంధనలు పాటించి, చట్టాలకు అతీతులై ఉండాలని సూచించారు.వారందరి పేర్లను చదువుతూ వివరాలు వెల్లడించిన ట్రంప్.. ఇది అంత సులభం కాదు. మీరు చాలా వరకు ప్రయాణించారు..ఈ రోజు మాతో ఇక్కడ ఉన్నందుకు మేము అభినందిస్తున్నాం. ప్రపంచంలోనే అత్యంత విలువైన, అమూల్యమైన సంపదను పొందారు. దీనిని అమెరికన్ పౌరసత్వం అంటారు. ఉన్నత గౌరవం, గొప్ప హక్కు ఉంది అన్నారు.ఈ రోజు అమెరికా పౌరసత్వంతో లభించే విధులు, బాధ్యతలను కూడా అంగీకరించారు. విధేయతో ప్రమాణం చేయడం ద్వారా ప్రతి ఒక్కరూ మన దేశంతో పవిత్రమైన, విడదీయలేని ఒడంబడికలోకి ప్రవేశించారు.భారత్‌లో జన్మించి, 13 ఏళ్ల కిందట అమెరికాకు వచ్చిన సుధ నారాయణన్.. ఇప్పటికే తన వృత్తిపరమైన జీవితం అద్భుతమైన విజయాలను సాధించారని కొనియాడారు. ఆమె ఎంతో ప్రతిభావంతురాలని, సుధా దంపతులు అమెరికాకు ఎంతో చేస్తున్నారని, వారికి యాపిల్ పండ్ల వంటి ఇద్దరు పిల్లలున్నారని తెలిపారు. ఈ కార్యక్రమానికి గులాబీ వర్ణం చీరను ధరించి వచ్చిన సుధా సుందరి, ట్రంప్ చేతుల మీదుగా పౌరసత్వ పట్టాను అందుకున్నారు.

Related Posts