YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

వెంకయ్యతో విజయసాయిరెడ్డి భేటీ

వెంకయ్యతో విజయసాయిరెడ్డి భేటీ

న్యూఢిల్లీ, ఆగస్టు 26
వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడిని ఢిల్లీలో కలిశారు. వ్యవసాయం, మత్స్య, ప్లాంటేషన్‌, కొబ్బరి పీచు, పసుపు ఉత్పత్తి ఎగుమతులకు సంబంధించిన నివేదికను ఉపరాష్ట్రపతి వెంకయ్యకు సమర్పించారు. వ్యవసాయ ఉత్పత్తులు, ఎగుమతులు పెంచేలా చర్యలు తీసుకోవాలని కోరినట్లు తెలిపారు. రైతులకు కనీస మద్దతు ధర లభించేలా చూడాలని వినతిపత్రం అందజేసినట్లు చెప్పారు. విజయసాయిరెడ్డి పార్లమెంట్ స్థాయి సంఘం వాణిజ్యం కమిటీ చైర్మన్‌గా ఉన్నారు. వెంకయ్యతో భేటీలో తాజా పరిణామాలపైనా చర్చించినట్లు తెలుస్తోంది.

Related Posts