YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

ఆ...నలుగురూ.....

ఆ...నలుగురూ.....

న్యూ ఢిల్లీ ఆగష్టు 26  
రాహుల్ గాంధీ వ్యాఖ్యలతో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో టీ కప్ లో తుఫాన్ మాదిరి పార్టీలో సంక్షోభం నెలకొంది.. ఇప్పుడు ఈ వివాదాన్ని భూతద్దంలో చూపెడుతూ కాంగ్రెస్ చీలిక దిశగా పయనిస్తోందని బీజేపీ అనుకూల చానెల్స్ ప్రచారం చేస్తున్నాయి. దీంతో కాంగ్రెస్ లో ఏదో జరుగుతుందన్న భావన అందరిలో నెలకొంది.అయితే కాంగ్రెస్ లో ఇలాంటి వారు ఉన్నారని నిరూపించడానికి.. ముఖ్యంగా సోనియాగాంధీకి కళ్లు తెరిపించడానికి వెనుక నుంచి ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ చేత అలాంటి మాటలు అనిపించారని ఢిల్లీ వర్గాలు అంటున్నాయి.  అయితే ప్రజల్లో పలుకుబడి లేని నేతలు.. సీనియర్స్ అని చెప్పుకునే  గులాం నబీ అజాద్ ఆనంద్ శర్మ కపిల్ సిబాల్, శశిథరూర్  లు ఆవేశపడి కాంగ్రెస్ ను చీల్చే ప్లాన్ చేశారని. వారికి మద్దతు వస్తుందని భావించారు కానీ.. వాళ్లు వెళ్తేనే మేలు అని రాష్ట్రాల నుంచి ఏఐసీసీకి ఫోన్లు వెళ్లాయని సమాచారం.త్వరలో రాహుల్ ప్రియాంక మన్మోహన్ కూర్చొని ఈ నలుగురి బాగోతం బయటపెట్డడానికి రెడీ అవుతారట.. బీజేపీతో వారి బంధం సఖ్యత ఉన్నాయని బయటపెడుతారని టాక్ వినిపిస్తోంది. ఆ నలుగురిని సస్పెండ్ చేయాలని కాంగ్రెస్ అధిష్టానం డిసైడ్ అయ్యిందని ఢిల్లీ కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతోందట.. ఇప్పుడిదే టాపిక్ కాంగ్రెస్ వర్గాల్లో హాట్ టాపిక్ మారింది. మీడియా వర్గాలకు లీక్ అవుతోంది.

Related Posts