YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

కరోనాకు స్వదేశీ కిట్లు

కరోనాకు స్వదేశీ కిట్లు

హైద్రాబాద్, ఆగస్టు 27,
కరోనా మహమ్మారితో అలుపెరుగని పోరు సాగిస్తున్న భారత్.. ఈ వైరస్‌ను గుర్తించడానికి స్వదేశీ టెస్టింగ్ కిట్‌ను అభివృద్ధి చేసింది. అంతేకాదు.. ఈ పరీక్ష ద్వారా కొవిడ్-19 నిర్ధారణ మరింత వేగంగా, సులభతరంగా చేయవచ్చని కిట్‌ను ఉత్పత్తి చేసిన సంస్థ వెల్లడించింది. ఢిల్లీకి చెందిన ‘ఆస్కార్ మెడికేర్’ సంస్థ దీన్ని రూపొందించింది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) దీనికి ఆమోదం తెలిపింది. భారతదేశ మొట్టమొదటి అధికారిక కొవిడ్-19 టెస్ట్‌ కిట్‌గా దీన్ని అభివర్ణిస్తున్నారు. ఈ కిట్ ధర కూడా తక్కువే కావడం విశేషం.ఆస్కార్‌ మెడికేర్‌ సంస్థ ఇప్పటికే హెచ్‌ఐవీ, మలేరియా, డెంగ్యూ పరీక్ష కిట్ల తయారీ ద్వారా గుర్తింపు సాధించింది. దేశంలోని మూడు చోట్ల ఈ కిట్లను తయారుచేస్తోంది. తమ సంస్థ అభివృద్ధి చేసిన కొవిడ్-19 ‘పాయింట్‌ ఆఫ్‌ కేర్‌’ (పీఓసీ) కిట్‌.. మానవుడిలో SARS-CoV-2 వైరస్ ఉనికిని 20 నిమిషాల్లోనే గుర్తించి ఫలితాలను అందించగలదని ఆస్కార్ మెడికేర్ సీఈవో ఆనంద్ సిక్రీ పేర్కొన్నారు.ఈ ర్యాపిడ్ టెస్టింగ్ కిట్ ధర సుమారు రూ.200 ఉంటుందని ఆయన తెలిపారు. సెప్టెంబర్‌లో రెండు లక్షల టెస్ట్ కిట్లను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు వెల్లడించారు. కిట్ల ఉత్పత్తిలో ఆస్కార్ మెడికేర్‌కు అంతకు ఎన్నో రేట్ల సామర్థ్యం ఉందని ఆయన తెలిపారు. కిట్ల మార్కెటింగ్‌ కోసం తమ సంస్థ ఇప్పటికే దేశవ్యాప్తంగా పంపిణీదారులతో ఒప్పందం కుదుర్చుకుందని పేర్కొన్నారు.

Related Posts