YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

తిరుపతిలో బైక్ తగలబెట్టారు

తిరుపతిలో బైక్ తగలబెట్టారు

ఢిల్లీ మీద యుద్ధం అంటూ, మన రాష్ట్రంలో బంద్ లు అంటూ, మన ప్రజానికాన్ని ఇబ్బంది పెట్టేలా, వైసిపీ, జనసేన, చలసాని, కమ్యూనిస్ట్ లు బంద్ చేశారు. తిరుపతిలో, వైసిపీ మాత్రం రెచ్చిపోయింది... రాష్ట్ర బంద్ సందర్భంగా తిరుపతి బస్టాండ్ సమీపంలో ఓ వాహన దారుడు రోడ్ ప్రక్కన పార్క్ చేసిన టూవీలర్ బైక్ దహనం చేశారు. వాహనదారుడు లబోదిబోమంటున్నారు. త‌న‌కు న్యాయం చేయాలని కోరారు. వైస్సార్ సీపీ నాయకులు పై పోలిస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తానన్న బాధితుడు.సామాన్య ప్రజల ఆస్థులు ధ్వంసం చేస్తూ, కేంద్రం పై యుద్ధం ఏంటో వీరికే తెలియాలి... ఇలా బంద్ చెయ్యటం వళ్ళ, రాష్ట్రానికి నష్టం తప్ప, మోడీకి ఏమన్నా అవుతుందా ? ఇలా బంద్ లతో,ర రాష్ట్రం నాశనం అవ్వాలనే వారి ప్లాన్ సక్సెస్ అయినట్టే కాని, వారికి ఏమి అవ్వదు... సామాన్య ప్రజలు ప్రయాణాలు వాయిదా పడితే, రాష్ట్రంలో ఇబ్బంది ఉంటుందా ? మోడీ మీద ఒత్తిడి ఉంటుందా ? బ్యాంకు లు మూసుకుపొతే, రాష్ట్రంలో ఇబ్బంది ఉంటుందా ? మోడీ మీద ఒత్తిడి ఉంటుందా ? స్కూల్స్ మూసుకుపొతే రాష్ట్రంలో ఇబ్బంది ఉంటుందా ? మోడీ మీద ఒత్తిడి ఉంటుందా ? వ్యాపారాలు మూసేస్తే రాష్ట్రంలో ఇబ్బంది ఉంటుందా ? మోడీ మీద ఒత్తిడి ఉంటుందా ? ఎవరి కోసం చేస్తున్నారు ఇది ?

Related Posts