YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

కేదారిలంకలో తోట త్రిమూర్తులు పర్యటన

కేదారిలంకలో తోట త్రిమూర్తులు పర్యటన

రాజమండ్రి  ఆగస్టు 27, 
వైఎస్సార్ సీపీ అమలాపురం పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు, మండపేట నియోజకవర్గ కోఆర్డినేటర్ తోట త్రిమూర్తులు కపిలేశ్వరపురం మండలంలోని కేదారిలంక, వీధివారిలంక, నారాయణలంక గ్రామాల్లో పర్యటించారు. వరద బాధితులకు ప్రభుత్వం తరపున బియ్యం, నూనె, కందిపప్పు, తదితర ఉచిత నిత్యావసర సరుకులను అందజేశారు. వరద నీటిలో ప్రజలు పడిన బాధలను  అడిగి తెలుసుక్నునారు. ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. వైఎస్సార్  మాచర పీఏసీఎస్ మాజీ అధ్యక్షుడు కరెడ్ల చిన్నా, మరికొందరు వైఎస్సార్ సీపీలో చేరగా వారికి పార్టీ కండువాలను కప్పి తోట త్రిమూర్తులు సాదరంగా ఆహ్వానించారు. ఈ   కార్యక్రమంలో తహసీల్దార్ దుర్గారావు, పార్టీ మండల కన్వీనర్ శీలం గోవింద్,  వీధివెంకటరెడ్డి బాబు, వైస్సార్సీపీ ఎంపీటీసీ అభ్యర్థి నాగేశ్వరరావు, దొరబాబు,  నాగు, మాజీ సర్పంచ్ లు, మరియు మాజీ ఎంపీటీసీలు పాల్గొన్నారు..

Related Posts