YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు తెలంగాణ

గాంధీ ఆస్పత్రి నుండి పరారైన నలుగురు ఖైదీలు !

గాంధీ ఆస్పత్రి నుండి పరారైన నలుగురు ఖైదీలు !

హైదరాబాద్ ఆగష్టు 27  
సికింద్రాబాద్ గాంధీ హాస్పిటల్ లో మళ్లీ  కరోనా బాధితులు కలకలం రేపారు. గాంధీలో  చికిత్స పొందుతున్న నలుగురు కరోనా బాధితులు హాస్పిటల్ నుండి పారిపోయారు. హాస్పిటల్ నుండి పరారైన నలుగురు కరోనా బాధితులు కూడా చర్లపల్లి జైల్లో ఖైదీలుగా శిక్షను అనుభవిస్తున్నారు. నలుగురు ఖైదీలకు కరోనా సోకడంతో జైలు సిబ్బంది చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రిలో చికిత్స అందించడానికి తీసుకువచ్చారు. అయితే పారిపోవడానికి ఇదే అనువైన సమయం అనుకున్న ఆ ఖైదీలు ఆస్పత్రి పరారయ్యారని ఈ విషయాన్ని అక్కడి సిబ్బంది ఆలస్యంగా గుర్తించారని దీనితో  పారిపోయిన ఖైదీల కోసం పోలీసులు స్పెషల్ టీంగా ఏర్పడి వారికోసం వెదుకుతున్నారని ..ప్రసారమాధ్యమాల్లో ప్రచారం అవుతుంది. తెల్లవారు జామున 3 గంటల సమయంలో ఆస్పత్రి నుండి ఖైదీలు తప్పించుకున్నట్లు తెలుస్తోంది. గాంధీ ఆసుపత్రి మెయిన్ బిల్డింగ్ లోని రెండవ అంతస్తులో బాత్ రూమ్ గ్రిల్స్ తొలగించి ఖైదీలు పారిపోయినట్లు అధికారులు గుర్తించారు. పారిపోయిన నలుగురు ఖైదీలు సోమసుందర్ పి. నర్సింహ మొమహ్మద్ అబ్దుల్ అర్బాజ్ ఎంీ జావిద్గా సమాచారం. పరారైన నలుగురు ఖైదీల కోసం ఇప్పుడు పోలీస్ సిబ్బంది ముమ్మరంగా గాలిస్తున్నారు.
=

Related Posts