YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

అద్దె ఇంట్లో ఉండేవారికి కేంద్రం త్వరలో శుభవార్త

అద్దె ఇంట్లో ఉండేవారికి కేంద్రం త్వరలో శుభవార్త

న్యూ ఢిల్లీ  ఆగష్టు 27
ఇప్పుడంతా బతుకుదెరువు కోసం పట్నాల బాట పడుతున్నారు. అక్కడ ఇళ్లను అద్దెకు తీసుకొని సంసార సాగరాన్ని ఈదుతున్నారు. ఈ క్రమంలోనే ఇంటి అద్దెల దోపిడీ కూడా ప్రజలకు భారమవుతోంది. ఈ క్రమంలోనే అద్దె ఇంట్లో ఉండేవారికి కేంద్రం శుభవార్త చెప్పబోతోంది. త్వరలో కొత్తగా నమూనా అద్దె చట్టాన్ని తీసుకువచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఖాళీగా ఉండే ఇళ్లను అద్దెకు ఇస్తూ రెంటల్ హౌజింగ్ సెక్టార్ ను ప్రోత్సహించడంతో భాగంగా ఈ కొత్త అద్దె చట్టానికి కేంద్రం మెరుగులు దిద్దుతోంది.వచ్చే నెలలోనే ఈ అద్దె చట్టానికి ఆమోదం లభిస్తుందని కేంద్ర గృహ పట్టణ మంత్రిత్వశాఖ కార్యదర్శి దుర్గా శంకర్ మిశ్రా తెలిపారు. అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ కొత్త చట్టాన్ని అమలు చేయాలని సూచించారు.ఈ చట్టం ప్రకారం ఖాళీగా ఉన్న 60నుంచి 80 శాతం ఇండ్లు రెంటల్ మార్కెట్లోకి వస్తాయని కార్యదర్శి మిశ్రా తెలిపారు.  రియల్ ఎస్టేట్ వ్యాపారులు అమ్ముడుపోని నిర్మాణాలను అద్దె గృహాలుగా మార్చుకునే అవకాశం లభిస్తుందని తెలిపారు.ఈ చట్టం ప్రకారం యజమాని అద్దెకారుడికి మధ్య తలెత్తే వివాదాలను జిల్లా కలెక్టర్ సమక్షంలో పరిష్కరించేందుకు వీలు కల్పిస్తుంది. అద్దె పెంచాలంటే.. మూడు నెలల ముందు దాని గురించి నోటీసులు ఇవ్వడం వంటివి ఈ చట్టంలో చేర్చుతున్నట్టు మిశ్రా తెలిపారు. అద్దెదారులకు వేధింపులు తగ్గించడమే ఇందులో ప్రధాన ఉద్దేశం.

Related Posts