YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

ఏపీ సర్కార్ కు హైకోర్టు షాక్.. రాజధానిపై మరోసారి స్టేటస్ కో..

ఏపీ సర్కార్ కు హైకోర్టు షాక్.. రాజధానిపై మరోసారి స్టేటస్ కో..

అమరావతి ఆగష్టు 27 
ఏపీ మూడు రాజధానుల వ్యవహారం ఏపీ హైకోర్టులో తేలడం లేదు. రాజధాని మార్పుపై దాఖలైన పిటీషన్లను  హైకోర్టు గురువారం విచారణ జరిపింది. ఈ క్రమంలోనే వచ్చే నెల 21 నుంచి రోజువారీ విచారణపై న్యాయవాదులతో ధర్మాసనం చర్చించింది. రాజధానిపై హైకోర్టు ఇచ్చిన స్టేటస్ కో ఇవాళ్టితో ముగిసింది. ఈ క్రమంలోనే విచారణ జరిపిన హైకోర్టు సెప్టెంబర్ 21 వరకు స్టేటస్ కో అమలు గడువును పొడిగిస్తూ ఆదేశాలిచ్చింది. రాజధాని బిల్లులు అమలు చేయకుండా ఈ స్టేటస్ కో కొనసాగుతుందని తెలిపింది. తదుపరి విచారణ సెప్టెంబర్ 21కి వాయిదా వేసింది. ఇక విశాఖలో భారీ అతిథిగృహాన్ని సర్కార్ నిర్మిస్తోందని.. రాజధాని తరలింపు లేకుండా ఈ అతిథి గృహం నిర్మాణం ఏంటని లాయర్ నితీష్ గుప్తా వాదించగా.. దీనిపై వివరణ ఇవ్వాలని కౌంటర్ దాఖలుకు సెప్టెంబర్ 10వరకు సర్కార్ కు గడువు ఇచ్చింది.

Related Posts