న్యూఢిల్లీ ఆగష్టు 27
తెలంగాణ రైతులకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. రామగుండం ఎరువుల కర్మాగారంపై అధికారులతో కిషన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. నవంబర్ 15 నుంచి ఉత్పత్తి ప్రారంభించనున్నట్లు కేంద్రమంత్రికి అధికారులు తెలిపారు. కిసాన్ బ్రాండ్ పేరుతో రామగుండం ఎరువుల కర్మాగారం యూరియాను తయారు చేయనుంది. ప్రత్యక్షంగా 460 మందికి... పరోక్షంగా మరో వెయ్యి మందికి ఉపాధి లభించనుంది. ఉత్పత్తిలో 50 శాతం ఎరువులు తెలంగాణ రైతులకే దక్కనున్నాయి.