YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

వైసీపీ కండువా కప్పుకోనున్న పంచకర్ల రమేష్ బాబు

వైసీపీ కండువా కప్పుకోనున్న పంచకర్ల రమేష్ బాబు

విశాఖపట్టణం ఆగష్టు 27 
టీడీపీ మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు రేపు వైసీపీలో చేరనున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో ఆయన వైసీపీ కండువా కప్పుకోనున్నారు. విశాఖను రాజధానిగా టీడీపీ వ్యతిరేకించడాన్ని నిరసిస్తూ కొన్ని నెలల క్రితమే తెలుగుదేశానికి ఆయన రాజీనామా చేశారు. అప్పటి నుంచి రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. తాజాగా పంచకర్ల రమేష్ బాబు వైసీపీలో చేరాలని నిర్ణయం తీసుకున్నారు. ఇదిలా ఉంటే విశాఖకు చెందిన మరో ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్‌రావు కూడా వైసీపీలో చేరతారని జోరుగా ప్రచారం సాగింది. ప్రస్తుతం ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయన వైసీపీలో చేరతారని ప్రచారం జరిగింది. ముఖ్యమంత్రి జగన్‌ దగ్గర ఉండే ముఖ్యమైన సన్నిహితుల ద్వారా మంతనాలు జరిగినట్లుగా కూడా ప్రచారం జరిగింది. కానీ ఆయన వైసీపీలో చేరలేదు.

Related Posts