YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

అమరావతి రైతులకు న్యాయం జరుగుతుంది: ఎంపీ రాఘురామ

అమరావతి రైతులకు న్యాయం జరుగుతుంది: ఎంపీ రాఘురామ

న్యూఢిల్లీ  ఆగస్టు 27
అమరావతి రైతులకు నూటికి నూరుపాళ్లు న్యాయం జరుగుతుందని ఎంపీ రాఘురామ కృష్ణంరాజు అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ న్యాయం పూర్తిగా అమరాతి రైతుల పక్షాన నిలుస్తుందన్నారు. న్యాయం జరుగుతుందన్న మనోధైర్యంతో మహిళలు, రైతులు ముందుకువెళుతున్నారని, గాంధేయ మార్గంలో సాగాలని పిలుపు ఇచ్చారు.ప్రముఖ న్యాయవాదులు తమవైపు వాదించడానికే కాదు... వాదించకుండా ఉండటానికీ జగన్‌ ప్రభుత్వం కోట్లాది రూపాయాలు వెచ్చిస్తోందని రఘురామ విమర్శించారు. ప్రజాధనం వృథా చేసి ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకోవడం సమంజసం కాదన్నారు. పరిణామాలు ఎలా ఉంటాయో ముందుముందు చూద్దామని ఓ మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. న్యాయపరమైన విషయాల్లో సీఎం జగన్‌కు సలహాలు ఇచ్చేవారు లేరనుకుంటానని, ముఖ్యమంత్రి అనవసరంగా పడి ఉన్న సలహాలదారులును తప్పించి...న్యాయసలహాదారులను పెట్టుకుంటే మంచిదని రఘురామకృష్ణరాజు సూచించారు.

Related Posts