YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

తెలంగాణ ప్రభుత్వం భూమి కేటాయింపుపై నోటీసులు

తెలంగాణ ప్రభుత్వం భూమి కేటాయింపుపై నోటీసులు

హైద్రాబాద్, ఆగస్టు 27
సినీ దర్శకుడు ఎన్‌.శంకర్‌కు తెలంగాణ ప్రభుత్వం భూమి కేటాయింపుపై హైకోర్టులో గురువారం మరోసారి విచారణ జరిగింది. రూ.2.5 కోట్ల విలువ చేసే భూమిని రూ.25 లక్షలకు ఎలా కేటాయిస్తారని హైకోర్టు ధర్మాసనం ప్రభుత్వం తరపు న్యాయవాదిని ప్రశ్నించింది. హైదరాబాద్ నగరంలో ఇప్పటికే అద్భుతంగా సినిమా చిత్రీకరణల కోసం రామోజీ ఫిలింసిటీ ఉందని, ఇతర వ్యక్తులకు స్థలాలు ఇవ్వకుండా ప్రభుత్వమే సొంతంగా సినిమాల కోసం స్టూడియో నిర్మించవచ్చు కదా? అని సూచించింది. ప్రభుత్వ భూములను సినీ పరిశ్రమ ఆక్రమించడానికి వీల్లేదని ధర్మాసనం తేల్చి చెప్పింది. దర్శకుడు శంకర్‌కు తెలంగాణ ప్రభుత్వం భూమిని కేటాయించడాన్ని సవాలు చేస్తూ పలువురు గతంలోనే హైకోర్టును ఆశ్రయించారు.ఇలా విలువైన భూములను సినీ ప్రముఖుల పేరు చెప్పి కట్టబెడుతూ ప్రభుత్వం ప్రజలకు తప్పుడు సంకేతాలు ఇవ్వకూడదని స్పష్టం చేసింది. కేబినెట్ నిర్ణయాలకు సహేతుకత ఉండాలని ప్రభుత్వానికి సూచించింది. ఇక ధర్మాసనం వ్యాఖ్యలపై స్పందించిన ప్రభుత్వం తరపు న్యాయవాది, అడ్వకేట్‌ జనరల్‌ బీఎస్‌ ప్రసాద్‌ కేబినెట్‌ నిర్ణయాన్ని సమర్థించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఎన్.శంకర్ కీలక పాత్ర పోషించారని న్యాయస్థానానికి వివరించారు.అయితే, అడ్వకేట్ జనరల్ వ్యాఖ్యలతో హైకోర్టు ధర్మాసనం ఏకీభవించలేదు. తెలంగాణ కోసం ఎంతో మంది ప్రాణ త్యాగాలు చేశారని, మరెంతో మంది కీలక పాత్ర పోషించారని కోర్టు చేసింది. మరి వారందరికీ ఇలాగే భూమి ఇస్తారా అని ప్రశ్నించించింది. దీనిపై మరోసారి కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీనికి ఏజీ రెండు వారాల గడువు కోరారు. ఇందుకు ధర్మాసనం అనుమతించింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.

Related Posts