YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు దేశీయం

7వ తరగతి బాలికపై టీచర్ అత్యాచారం

7వ తరగతి బాలికపై టీచర్ అత్యాచారం

లక్నో, ఆగస్టు 27 
ఏడో తరగతి బాలికపై కన్నేసిన టీచర్ ఆమెకు మాయమాటలు చెప్పి ఇంటికి పిలిపించుకుని అత్యాచారం చేసిన అమానుష ఘటన వెలుగుచూసింది. ఆ దారుణాన్ని వీడియోలు తీసి ఎవరికైనా చెబితే సోషల్ మీడియాలో వైరల్ చేస్తానంటూ బెదిరింపులకు దిగాడు. యూపీలోని గోరఖ్‌పూర్‌లో ఈ దారుణం చోటుచేసుకుంది. నగరంలోని ఓ పాఠశాలలో 7 వ తరగతి చదువుతున్న బాలిక(15)పై స్కూల్ మేనేజర్ హరేంద్ర యాదవ్(38) కన్నేశాడు.కామంతో కళ్లు మూసుకుపోయి ఆమెపై దారుణంగా అత్యాచారం చేశాడు. ఎవరూ లేని సమయంలో ఇంటికి పిలిపించుకుని అఘాయిత్యానికి ఒడిగట్టాడు. అంతటితో ఆగని నీచుడు ఆ రేప్ చేస్తూ వీడియోలు తీశాడు. బాలిక నగ్నంగా ఉన్న సమయంలో ఫొటోలు, వీడియోలు తీసి బ్లాక్‌మెయిల్ చేయడం ప్రారంభించాడు. అత్యాచారం గురించి ఎవరికైనా చెబితే వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానంటూ బెదిరింపులకు దిగాడు.ఈ విషయం మీ తండ్రికి తెలిస్తే చంపేస్తాడంటూ బాలికను భయపెట్టాడు. తన ఇంట్లోనే ఉంటూ చదువుకోవాలని ఆమెను ఒత్తిడి చేశాడు. కొద్దికాలం మౌనంగా భరించిన బాధితురాలు.. మృగాడి వేధింపులు ఎక్కువవడంతో తట్టుకోలేక కుటుంబ సభ్యులకు విషయం చెప్పడంతో దారుణం వెలుగులోకి వచ్చింది. బాధితురాలి తండ్రి పోలీసులను ఆశ్రయించాడు. అయితే అక్కడ చేదు అనుభవం ఎదురైంది.స్టేషన్ ఆఫీసర్ ఫిర్యాదును సీరియస్‌గా తీసుకోకుండా నిర్లక్ష్యం వహించాడు. నిందితుడిని కనీసం అరెస్టు చేయలేదు. విధి నిర్వహణలో అలసత్వంతో పాటు బాధితురాలి పట్ల నిర్దయగా వ్యవహరించడంతో ఆమె తండ్రి ఎస్‌ఎస్‌పీ జోగిందర్ సింగ్‌కి ఫిర్యాదు చేశారు. సీరియస్‌గా స్పందించిన ఎస్‌ఎస్‌పీ తక్షణ చర్యలకు ఆదేశించారు. పోలీసులు అరెస్టు చేస్తారని తెలియడంతో నిందితుడు పరారయ్యాడు. విధుల్లో అలసత్వం ప్రదర్శించిన స్టేషన్‌ ఆఫీసర్‌పై వేటు పడింది.

Related Posts