జగిత్యాల ఆగస్టు 27
విధినిర్వహణలో కరోనా మహమ్మారి బారినపడి మృతి చెందిన జగిత్యాల జిల్లా అదనపు ఎస్పీ దక్షిణామూర్తి కుటుంబాన్ని పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి పరామర్శించారు. గురువారం కరీంనగర్ లోని ఏఎస్పీ దక్షిణామూర్తి ఇంటికి వెళ్ళి ఆయన చిత్రపటానికి జీవన్ రెడ్డి నివాళులర్పించారు. ఇటువంటి పరిస్థితుల్లో ధైర్యంగా ఉండాలని కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ పోలీసు స్టేషన్ కు వచ్చే ఫిర్యాదు దారులపట్ల స్నేహపూర్వకంగా ఉండాలని దక్షిణా మూర్తి పోలీసులకు సూచించే వారిని, విధులు పట్ల ఎవరు నిర్లక్ష్యం వహించిన సహించేవారుకాదని పోలీసు లు చెబుతుండే వారన్నారు. కరోనా బాధితులకు ధైర్యం చెప్పి తానే ఆవ్యాదికి గురై మరణింఛడం బాధాకరమన్నారు. విధినిర్వహణలో కరోనా వ్యాధి పోరాటంలో ప్రాణాలర్పించిన దక్షిణామూర్తి కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని కోరారు. జీవన్ రెడ్డి వెంట జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఉన్నారు.