YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు దేశీయం

సినిమా స్టైల్లో బెదిరింపులు.

సినిమా స్టైల్లో బెదిరింపులు.

భోపాల్, ఆగస్టు 28, 
జల్సా సినిమాలో దామోదర్ రెడ్డి క్యారెక్టర్‌ని అస్సలు మరిచిపోలేం. పవర్‌ఫుల్ విలన్‌గా అందరినీ భయపెట్టేస్తాడు. జైలు నుంచే కథ నడిపించేస్తాడు. సెటిల్మెంట్ అయినా.. వసూళ్లైనా కటకటాల వెనక నుంచే. జైలు అధికారులు సైతం తానాతందానా అనాల్సిందే. అయితే అలాంటివి కేవలం సినిమాల్లోనే చూడగలం అనుకుంటాం. కానీ అదే నిజంగా జరిగితే.. మీరు విన్నది నిజంగా నిజమే. జైలు గోడల మధ్య ప్రశాంతంగా కూర్చుని ఫోన్ కాల్స్ చేసి వసూళ్లకు పాల్పడుతున్న కరుడుగట్టిన నేరస్తులగ్యాంగ్ షాకింగ్ బాగోతం బయటపడింది. దేశరాజధాని ఢిల్లీలో వెలుగుచూసిన ఈ ఘటన వివరాలు..జైలు నుంచే ఫోన్ చేసి వసూళ్లకు పాల్పడుతున్న ఐదుగురు సభ్యుల గ్యాంగ్‌ని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. అందులో ఆ జైలు వార్డెన్ కూడా ఉండడం సంచలనం కలిగించింది. ఢిల్లీలోని నందు గ్యాంగ్‌కి చెందిన కీలక సభ్యుడు వికాస్(28) ఓ కేసులో మండోలి జైలులో ఖైదీగా ఉన్నాడు. అతనికి ప్రమోద్ కుమార్(30), హనీ రాజ్‌పాల్(35), జగ్మోహన్(23) జతకలిశారు. అందరూ కలసి గ్యాంగ్‌గా ఏర్పడి బలవంతపు వసూళ్ల(ఎక్స్‌టార్షన్)‌కు దిగారు. జైలు నుంచే ఫోన్ చేసి బెదిరింపులకు దిగేవారు.జైలులోకి సిమ్ కార్డులు, ఫోన్లు తీసుకురావడం నుంచి బయటి వ్యక్తులకు టార్గెట్స్ ఇవ్వడం వరకూ ముఠా సభ్యులు ఒక్కొక్కరు ఒక్కో పని పూర్తి చేసేవారు. రిమాండ్ ఖైదీగా ఉన్న ప్రమోద్ బెయిల్‌పై బయటికెళ్లాడు. నకిలీ ధ్రువపత్రాలతో సిమ్ కార్డులు కొనుగోలు చేసి జైల్లోకి చేరవేయడం కుమార్ పని. అందులో భాగంగా ఆ సిమ్ కార్డులను జైలు హెడ్ వార్డెన్ రాజేందర్ సింగ్‌(50)కి అందజేశాడు. ఆయన ఎలాంటి తనిఖీలు లేకుండా సిమ్ కార్డులను నేరుగా తీసుకెళ్లి రాజ్‌పాల్‌కి ఇచ్చేవాడు.అనంతరం రాజ్‌పాల్ మొబైల్ ఫోన్లు సిద్ధం చేసి వాటిని ప్రధాన నిందితుడు వికాస్‌కి అందజేసేవాడు. వికాస్ కొందరు బిగ్‌షాట్స్‌ని ఎంచుకుని వారికి ఫోన్ చేసి అడిగిన డబ్బు ఇవ్వాలంటూ బెదిరింపులకు పాల్పడేవాడు. టార్గెట్స్‌‌పై నిఘా పెట్టాలంటూ బయట ఉన్న గ్యాంగ్ సభ్యులకు సూచించేవాడు. తీరా అతని బెదిరింపులకు భయపడిపోయిన బాధితుడొకరు పోలీసులను ఆశ్రయించడంతో కరుడుగట్టిన గ్యాంగ్ కార్యకలాపాలు వెలుగులోకి వచ్చాయి.బెదిరింపుల కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితులు ఉపయోగించిన సెల్‌ఫోన్ నంబర్ల ధ్రువపత్రాలను ఆరా తీయడంతో కుమార్ సోదరుడు జగ్మోహన్ పేరు మీద ఉన్నట్లు తేలింది. అతనిని అదుపులోకి తీసుకుని తమ స్టైల్లో విచారించడంతో కుమార్.. ఆ తరువాత రాజ్‌పాల్, సిమ్ కార్డులు అందజేసిన హెడ్ వార్డెన్ రాజేందర్ బుక్కయ్యారు. అనంతరం అసలు నిందితుడు వికాస్‌పైనా కేసు నమోదు చేసి పోలీసులు అరెస్టు చేశారు. నిందితులతో వార్డెన్ రాజేందర్ సింగ్ చేసిన చాటింగ్ లిస్ట్ వంటి పక్కా ఆధారాలతో ఆయన్ను అరెస్టు చేసి కటకటాల వెనక్కి నెట్టారుః

Related Posts