YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

చర్చనీయాంశంగా మారిన బాలిక లెటర్

చర్చనీయాంశంగా మారిన బాలిక లెటర్

లక్నో, ఆగస్టు 28, 
ఇదేం జనాభా? ఇదేం కాలుష్యం? వీరేం మనుషులు? ఇదేం అవినీతి? తల్లితండ్రులను కన్న కొడుకులే ఓల్డ్ ఏజ్ హోమ్‌లకు పంపిస్తారా? 16 ఏళ్ల ఓ బాలికను తీవ్రంగా కలచివేసిన ప్రశ్నలివి. ఈ ప్రశ్నలకు సమాధానం దొరక్క ప్రాణాలు తీసుకుంది. గన్‌తో తలపై కాల్చుకుని ఆత్మహత్య చేసుకుంది. అది కూడా దేశం 74వ స్వాతంత్య్ర వేడుకలు నిర్వహించుకుంటున్న వేళ. ఉత్తర ప్రదేశ్‌లోని బరేలీ జిల్లా సంబాల్‌లో చోటు చేసుకున్న ఈ ఘటన దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపుతోంది. మానవతావాదులను తీవ్రంగా కలచివేసింది.ఆత్మహత్య చేసుకోవడానికి ముందు ఆ బాలిక ప్రధాని మోదీని ఉద్దేశించి 18 పేజీల సుదీర్ఘ లేఖ రాసింది. ఆ లేఖలో అనేక అంశాలను ప్రస్తావించింది. అవన్నీ సామాజిక, వాతావరణ సంబంధ అంశాలే కావడం గమనార్హం. దీపావళికి టపాసులు కాల్చొద్దు. రసాయనాలు కలిపి తయారు చేసిన రంగులతో హోళీ పండుగ చేసుకోవద్దు. అన్నీ ఇలాంటి విషయాలే.దేశంలో పర్యావరణ కాలుష్యం, అవినీతి నానాటికీ పెరుగుతోందని బాలిక తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. అందులో పర్యావరణ కాలుష్యం, అవినీతి, అడవులను ఇష్టమొచ్చినట్లు నరికివేస్తుండటంపై పలు ప్రశ్నలు సంధించింది. సామాజిక చెడులు రోజురోజుకూ పెరుగుతున్నాయని.. ఇది తనను ఎంతో బాధకు గురిచేస్తోందని పేర్కొంది. ఈ సమస్యలన్నింటినీ ప్రధాని మోదీతో చర్చించాలని భావిస్తున్నట్లు సూసైడ్ నోట్‌లో రాసింది.కన్నవాళ్లను వృద్ధాశ్రమానికి పంపే చోట ఉండలేను..దేశంలో వృద్ధులు నిరాధరణకు గురవుతున్న తీరు తననెంతో ఆవేదనకు గురిచేస్తోందని బాలిక పేర్కొంది. వారికి అందుతున్న చికిత్సపై ఆందోళన వ్యక్తంచేసింది. తల్లిదండ్రులను వృద్ధాశ్రమాలకు పంపే చోట తాను ఉండలేనని పేర్కొంది.ఆగస్టు 14న రాత్రి బాలిక తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకుందని గున్నౌర్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్‌హెచ్‌ఓ) దేవేంద్ర కుమార్ తెలిపారు. ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి ఉపయోగించిన రివాల్వర్‌ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. బాలిక మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం తరలించినట్లు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

Related Posts