YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం తెలంగాణ

రైతులు రసాయన ఎరువులలో సమతుల్యత పాటించాలి

రైతులు రసాయన ఎరువులలో సమతుల్యత పాటించాలి

అసిఫాబాద్ ఆగష్టు 28 
ఆసిఫాబాద్ మండలం ఇటిక్యాల గ్రామంలో వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో జాతీయ ఆహార భద్రత మిషన్ కార్యక్రమంలో భాగంగా గ్రామ రైతులకు శిక్షణ మరియు క్షేత్ర ప్రదర్శన నిర్వహించారు . రైతులు సమతుల్యత ఎరువులను వాడాలని జిల్లా వ్యవసాయాధికారి రవీందర్ సూచించారు .
ఒక ఎకరం పత్తి పంటకు గాను పంట కాలంలో 100 కిలోల యూరియా , 50 కిలోల డీఏపీ, 50 కిలోల పోటాష్ ఎరువులను మాత్రమే వాడాలన్నారు. పత్తి పంటలో ప్రధాన సమస్య అయిన రసం పీల్చు పురుగులను నివారించుటకు రైతులు వివిధ  రకాల పురుగు మందులు, అదిక మోతాదులల్లో వాడుతున్నరని , దానికి బదులుగా మోనోక్రోటోఫాస్ మరియు నీరు ను 1:4 నిష్పత్తిలో కలుపుకొని కాండంపై పూత పూయడం వలన అన్ని రకాల రసం పీల్చే పురుగుల ఉధృతి నుండి తక్కువ ఖర్చుతో పంట, పర్యావరణ ఆరోగ్యాన్ని కూడా కాపాడటం జరుగుతుందన్నారు .  కాండం పూత క్షేత్ర ప్రదర్శనను రైతు చౌదరి పెంటు చేనులో నిర్వహించారు .ఈ కార్యక్రమంలో అసిఫాబాద్ సహాయ వ్యవసాయ సంచాలకులు మిలింద్ కుమార్ , మండల వ్యవసాయాధికారి ఖాదర్ హుస్సేన్, ఎఇఓలు అపర్ణ , రాము , గ్రామ రైతులు కిష్టయ్య, పెంటు , విజయ్ తదితరులు పాలుగున్నారు.

Related Posts