YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

పేద ప్రజలు ఆత్మ గౌరవంతో జీవించాలి: మంత్రి పువ్వాడ

పేద ప్రజలు ఆత్మ గౌరవంతో జీవించాలి: మంత్రి పువ్వాడ

భద్రాద్రి కొత్తగూడెం ఆగష్టు 28 
పేద ప్రజలు ఆత్మ గౌరవంతో జీవించాలన్న ఉద్దేశంతో పైసా ఖర్చులేకుండా ఇండ్లు లేని నిరుపేదలకు అన్ని సదుపాయాలతో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల ను ప్రభుత్వం అందజేస్తుందని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు.జిల్లాలోని జులురుపాడు మండలం పడమటి నర్సాపురంలో రూ.5.03 కోట్లతో 80 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, దుబ్బతండా గ్రామంలో రూ.2.26 కోట్లతో 45 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, రామచంద్రపురంలో రూ.3.27 కోట్లతో 65 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, ఎలకలఒడ్డు గ్రామంలో రూ.1.76కోట్లుతో 35 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మొత్తం రూ. 12.32 కోట్లతో నూతనంగా నిర్మించిన 225 ఇండ్లను ఎమ్మెల్యే రాములు నాయక్ తో కలిసి మంత్రి పువ్వాడ లబ్ధిదారులకు అందజేశారు.

Related Posts