YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

మక్కా మసీదు ప్రాంతంలో ప్రశాంతం

మక్కా మసీదు ప్రాంతంలో ప్రశాంతం

మక్కామసీదు పేలుళ్ల కేసు తీర్పు అనంతరం దక్షిణ మండల డీసీపీ సత్యనారాయణ చార్మినార్, మక్కామసీదు ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ.. పాతబస్తీలో ప్రశాంత వాతావరణం ఉందన్నారు. అన్ని కార్యకలాపాలు యథావిధిగా కొనసాగుతున్నాయని తెలిపారు. సునిశిత ప్రాంతాల్లో 1500 మంది పోలీసులతో భద్రత ఏర్పాటు చేశామని చెప్పారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని డీసీపీ సత్యనారాయణ స్పష్టం చేశారు. మక్కామసీదు పేలుళ్ల కేసును నాంపల్లి ఎన్‌ఐఏ కోర్టు కొట్టివేసిన విషయం తెలిసిందే. ఐదుగురి నిందితులను కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది.

Related Posts