YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

కుదుట పడ్డ ప్రణబ్ ఆరోగ్యం

కుదుట పడ్డ ప్రణబ్ ఆరోగ్యం

న్యూఢిల్లీ, ఆగస్టు 29 
మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ఆరోగ్య పరిస్థితిపై ఢిల్లీలోని ఆర్మీ రీసెర్చ్ అండ్ రిఫరల్ హాస్పిటల్ శనివారం (ఆగస్టు 29) బులెటిన్‌ విడుదల చేసింది. ప్రణబ్ మూత్రపిండ  సంబంధిత వ్యవస్థ పని తీరు కాస్త మెరుగైందని వెల్లడించారు. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్‌కు సంబంధించిన చికిత్స కొనసాగిస్తున్నట్టు వైద్యులు తెలిపారు. ప్రణబ్‌ ముఖర్జీ ప్రస్తుతం  డీప్‌ కోమాలోనే ఉన్నారని.. అయితే, ఆయన ఆరోగ్య సూచీల్లో మెరుగుదల ఉందని వెల్లడించారు. ప్రణబ్‌ శరీరంలో రక్త ప్రసరణ, పల్స్‌ రేటు స్థిరంగా ఉన్నట్లు తెలిపారు.  ఆయణ్ని వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స కొనసాస్తున్నట్టు వెల్లడించారు.ఆరోగ్యం క్షీణించడంతో ప్రణబ్ ముఖర్జీ ఆగస్టు 10న ఆర్మీ హాస్పిటల్‌లో చేరారు. మెదడుకు రక్తాన్ని సరఫరా  చేసే ఓ నాళంలో రక్తం గడ్డకట్టడంతో వైద్యులు ఆయనకు ప్రత్యేక శస్త్రచికిత్స చేశారు. సర్జరీ తర్వాత ఆయన ఆరోగ్యం మెరుగు పడకపోగా.. మరింత క్షీణించింది. అంతేకాకుండా..  ఆపరేషన్‌కు ముందు చేసిన వైద్య పరీక్షల్లో ఆయనకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో ప్రణబ్ ఆరోగ్యంపై ఆందోళన నెలకొంది.కరోనా వైరస్ కారణంగా ప్రణబ్  ముఖర్జీ ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్ సోకింది. ఈ కారణంగా ఆయన ఊపిరితిత్తుల పనితీరు మందగించి ఆరోగ్యం మరింత క్షీణించిందని వైద్యులు తెలిపారు. ఆ తర్వాత ఆయన  మూత్రపిండాల పనితీరు పైనా ప్రభావం పడింది. ఆర్మీ హాస్పిటల్‌లో ప్రత్యేక వైద్య బృందం ప్రణబ్‌కు చికిత్స అందజేస్తోంది. ఆయన ఆరోగ్యం మెరుగుపడాలని అభిమానులు  ప్రార్థనలు చేస్తున్నారు.  

Related Posts