హైదరాబాద్ ఆగష్టు 29
తెలంగాణ గవర్నర్ తమిళిసైతో రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు భేటీ అయ్యారు. ఈ సమావేశంలో భాగంగా అసెంబ్లీ సమావేశాలు, కరోనాతో పాటు పలు విషయాలపై గవర్నర్తో సీఎం చర్చించారు. అనంతరం తమిళిసై బాబాయి మృతి చెందడంతో కేసీఆర్ పరామర్శించారు.కాగా.. తమిళనాడు కన్యాకుమారి లోక్సభ సభ్యుడు వసంతకుమార్ కన్నుమూసిన విషయం విదితమే. 70 సంవత్సరాల వసంత్కుమార్ కరోనాతో చెన్నై అపోలో ఆసుపత్రిలో ఆగస్ట్ 10న చేరారు. ఆయన్ను కాపాడేందుకు డాక్టర్లు చేసిన యత్నాలు ఫలించలేదు. వసంత్ కుమార్ ప్రస్తుతం తమిళనాడు కాంగ్రెస్ పార్టీకి కార్యనిర్వాహక అధ్యక్షుడిగా కూడా కొనసాగుతున్నారు. ఈయన తెలంగాణ గవర్నర్ తమిళసైకు స్వయానా బాబాయ్ అవుతారు. వసంత్ మరణంతో తమిళసై ఇంట విషాద ఛాయలు అలుముకున్నాయి.