న్యూఢిల్లీ ఆగష్టు 31
భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జి ఆరోగ్యం మరింత విషమిస్తున్నది. నిన్నటి నుంచి ఆయన ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తూ వస్తున్నదని ఢిల్లీలోని ఆర్మీ ఆస్పత్రి వైద్యులు తెలిపారు. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ కారణంగా ప్రస్తుతం ఆయన సెప్టిక్ షాక్లో ఉన్నారని, నిపుణులతో కూడిన వైద్య బృందం ఆయన ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నదని చెప్పారు. ప్రస్తుతం ఆయన ఇంకా డీప్ కోమాలోనే కొనసాగుతున్నారని, వెంటిలేటర్ సపోర్టుతో ఆయనకు చికిత్స అందిస్తున్నామని వెల్లడించారు.