YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా తెలంగాణ దేశీయం

వికారాబాద్ అడవుల్లో రకుల్

వికారాబాద్ అడవుల్లో రకుల్

హైద్రాబాద్, సెప్టెంబర్ 1, 
ముంబై నుంచి నేరుగా వికారాబాద్ అడవుల్లో వాలిపోయిందట యంగ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. సీక్రెట్‌గా అక్కడే షూటింగ్‌లో పాల్గొంటోందని తెలిసింది. ఆహా ఓటీటీ కోసం డైరెక్టర్ క్రిష్ రూపొందిస్తున్న ఓ వెబ్ సిరీస్ షూట్‌లో నటిస్తోందట రకుల్. ఈ వెబ్ సిరీస్ కోసం మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్‌తో వికారాబాద్ అడవుల్లో ఆడిపాడుతోందట. లాక్‌డౌన్ కారణంగా షూటింగ్స్ బంద్ అయ్యాక లాంగ్ గ్యాప్ తీసుకొని తిరిగి  సెట్స్ మీదకు వచ్చిందట రకుల్ ప్రీత్.  క్రిష్ తెరకెక్కిస్తున్న ఈ మూవీ కోసం విమానాశ్రయం దిగగానే నేరుగా వికారాబాద్ వెళ్లిందట రకుల్. అక్కడే సీక్రెట్‌గా క్రిష్ తన సినిమా షూటింగ్ చేస్తున్నారట. దాదాపు వారం రోజుల పాటు ఈ షూట్ ఉండొచ్చని తెలుస్తోంది. ఇందులో రకుల్ గ్లామర్ రోల్ పోషిస్తోందని టాక్. ఇకపోతే డైరెక్టర్ క్రిష్.. తన తదుపరి సినిమాను పవన్ కళ్యాణ్‌తో చేయనున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు షూటింగ్స్ లేకపోవడంతో ఆ గ్యాప్ ఫిల్ చేస్తూ ఇంతలో వైష్ణవ్ తేజ్- రకుల్ వెబ్ సిరీస్ ఫినిష్ చేయాలని ప్లాన్ చేసిన క్రిష్ దాన్ని ఇలా అమలు చేస్తున్నారని సమాచారం.ఇక తెలుగులో చివరగా ‘మన్మథుడు 2’ మూవీలో నాగార్జునతో రొమాన్స్ చేసిన రకుల్.. ఆ తర్వాత టాలీవుడ్ నుంచి అవకాశాలు సన్నగిల్లడంతో బాలీవుడ్‌పై ఫోకస్ పెట్టేసింది. ఉత్తరాది ప్రేక్షకులకు కూడా తన అందాల రుచి చూపించాలని ప్లాన్ చేసి బోల్డ్ పాత్రలు చేసేందుకు రెడీ అయింది. ఈ క్రమంలోనే ఆమె రీసెంట్‌గా ఓ వేశ్య పాత్ర చేసేందుకు అంగీకారం తెలిపిందని తెలుస్తోంది. ముంబై రెడ్ లైట్ ఏరియాకు చెందిన ప్రముఖ వేశ్య జీవిత కథ ఆధారంగా ఈ మూవీ రానుందని టాక్.

Related Posts