దేశం గొప్ప రాజకీయవేత్తను కోల్పోయింది
- రామచందర్ రావు
హైదరాబాద్
భారతరత్న మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చిత్రపటానికి బిజెపి రాష్ట్ర కార్యాలయంలో బిజెపి శాసనమండలి పక్ష నాయకులు ఎన్. రామచందర్ రావు, బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, దుగ్యాల ప్రదీప్ కుమార్, కుమారి బంగారు శృతి, బిజెపి రాష్ట్ర కార్యాలయ కార్యదర్శి డాక్టర్ ఉమా శంకర్ పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం సంతాప సూచకంగా భారతీయ జనతా పార్టీ జెండాను సగం వరకు దించడం జరిగింది .ఈ సందర్భంగా రామచంద్ర రావు మాట్లాడుతూ సుదీర్ఘమైన రాజకీయ అనుభవం కలిగిన వ్యక్తి. గొప్ప రాజకీయవేత్త. రాష్ట్రపతి పదవి తర్వాత ఆర్ ఎస్ ఎస్ ఏర్పాటుచేసిన ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. రెండు పర్యాయాలు ప్రధానమంత్రి అవకాశం వచ్చి చేజారిన వ్యక్తి. అన్ని రాజకీయ పార్టీల నేతలు రైట్ నుంచి లెఫ్ట్ వరకు అభిమానించే వ్యక్తి. ప్రణబ్ ముఖర్జీ ని తెలంగాణ ప్రజలు ఎప్పటికీ గుర్తుంచుకుంటారు. తెలంగాణ సాధనలో అన్ని రాజకీయ పార్టీలను కలుపుకొని తెలంగాణ సాధనలో వారి కృషి ఎనలేనిది. నాకు వ్యక్తిగతంగా రెండు సార్లు వారిని కలవడం జరిగింది. వారితో కలిసి నప్పుడు మంచి వ్యక్తిని వ్యక్తిత్వం ఉన్న వ్యక్తిని వారి ద్వారా అనేక అంశాలు తెలుసుకునే అవకాశం కలగడం జరిగింది. గుజ్జల ప్రేమేందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రణబ్ ముఖర్జీ మృతి సంతాపసూచకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు నిర్ణయించిన భారతీయ జనతా పార్టీ రాజకీయ కార్యక్రమాలను ఆరవ తేదీ వరకు వాయిదా వేసుకోవడం జరిగింది. ఈ ఆరవ తేదీ వరకు సంతాప దినాలుగా పరిగణిస్తున్నట్లుపేర్కొన్నారు.