YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

చిన్నమ్మకు మరో షాక్..రంగంలోకి దిగిన ఈడీ!

చిన్నమ్మకు మరో షాక్..రంగంలోకి దిగిన ఈడీ!

చిన్నమ్మకు మరో షాక్..రంగంలోకి దిగిన ఈడీ!
చెన్నయ్ 
అమ్మ జయలలితకు అత్యంత సన్నిహితురాలైన చిన్నమ్మ శశికళకు కష్టాలు తీరేలా లేవు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జైలుపాలైన ఆమె.. మరికొద్ది నెలల్లో విడుదల కావాల్సి ఉంది. జైలు నుంచి విడుదలైన తర్వాత తాను ఎక్కడ ఉండాలన్న విషయంతో పాటు.. రాజకీయంగా తాను చేయాల్సిన పనులపై ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్న ఆమెకు.. మరోసారి షాక్ తగిలింది. తాజాగా ఈడీ రంగంలోకి దిగి.. ఆమెకు అనూహ్యమైన షాకిచ్చినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే ఆమె మీద అనేక కేసులు విచారణలో ఉన్నాయి. తాజాగా ఆమెకు సంబంధించి రూ.300 కోట్ల విలువైన ఆస్తుల్ని ఈడీ జఫ్తు చేసినట్లుగా తెలుస్తోంది. తాజాగా ఈడీ జప్తు చేసిన ఆస్తుల్లో చెన్నై శివారులోని 200 ఎకరాల భూమితో పాటు.. 65 రకాల ఆస్తుల కొనుగోలు వివరాలు బయటకు వచ్చినట్లు తెలుస్తున్నారు. వీటన్నింటిని జప్తు చేసేందుకు వీలుగా నిర్ణయాలు తీసుకున్నట్లు చెబుతున్నారు.
తాజాగా జప్తు చేయాల్సిన ఆస్తుల్లో జైలుజీవితం తర్వాత తాను ఉండాలని భావిస్తున్న భవనాన్ని కూడా అధికారులు స్వాధీనం చేసుకోవటం గమనార్హం. తాజాగా ప్రభుత్వం జఫ్తు చేసిన ఆస్తుల విలువ రూ.300 కోట్లుగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే.. ఈ వ్యవహారాన్ని బయటకురానివ్వటం లేదని తెలుస్తోంది. తాజా పరిణామం చిన్నమ్మకు షాకింగ్ గా మారుతుందని చెప్పక తప్పదు.

Related Posts