YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

 ప్రజా సేవలో భాగంగా ఆయన చేపట్టిన అన్ని పదవులకూ వన్నె తెచ్చారు

 ప్రజా సేవలో భాగంగా ఆయన చేపట్టిన అన్ని పదవులకూ వన్నె తెచ్చారు

 ప్రజా సేవలో భాగంగా ఆయన చేపట్టిన అన్ని పదవులకూ వన్నె తెచ్చారు

తుర్కపల్లి, 
తుర్కపల్లి మండల కాంగ్రెస్ పార్టీ  ఆధ్వర్యంలో మంగళవారం తుర్కపల్లి మండల కేంద్రంలో  భారత మాజీ రాష్ట్రపతి భారత రత్నఅవార్డు గ్రహీత ప్రణబ్ ముఖర్జీ  కి  ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది.ఈ సందర్బంగాతుర్కపల్లి మండల పార్టీ అధ్యక్షులు ధనావత్ శంకర్ నాయక్ మాట్లాడుతూ దేశం ఓ గొప్ప రాజనీతిజ్ఞుడిని కోల్పోయింది. ఎంతో శ్రమ, పట్టుదల, క్రమశిక్షణతో దేశ రాజ్యాంగ అత్యున్నత పదవిని చేపట్టారు. ప్రజా సేవలో భాగంగా ఆయన చేపట్టిన అన్ని పదవులకూ వన్నె తెచ్చారు. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా తెలంగాణ రాష్ట్రము  ఏర్పాటు లో కీలక పాత్ర పోషించిన ప్రణబ్ ముఖర్జీ ని తెలంగాణ  ప్రజలు మరిచి పోరు అని అన్నారు   ఈ కార్యక్రమంలో వీరారెడ్డి పల్లి యంపి టి సి కానుగంటి శ్రీనివాస్ యాదవ్, తిరుమలాపూర్ గ్రామ  ఉప సర్పంచ్  సముద్రల వెంకటేష్,గ్రామశాఖ అధ్యక్షులు  రామగోని వెంకటేష్, సుధాకర్ నాయక్ మడోత్, నాయకులు ఎడ్ల చంద్రశేఖర్ రెడ్డి,వల్లెపు రమేష్, తలారి అశోక్  దుర్గయ్య, తదితరులు  పాల్గొన్నారు

Related Posts