YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు దేశీయం

ఆరుగురితో పెళ్లి... చివరికి

ఆరుగురితో పెళ్లి... చివరికి

ఆరుగురితో పెళ్లి... చివరికి
బెంగళూర్, 
నిత్య పెళ్లికూతురుగా మారిన ఓ మహిళ ఏకంగా ఆరుగురిని వివాహం చేసుకున్న ఘటన కర్ణాటకలో వెలుగులోకి వచ్చింది. కర్ణాటకలోని చిక్కమంగళూరు జిల్లా కంబినహళ్ళి గ్రామానికి చెందిన చంద్రు అలియాస్ చంద్రుడు (22) అనే యువకుడు ఇటీవల ప్రియా (38) అనే మహిళను వెంటపెట్టుకుని బెంగళూరులోని పోలీస్‌స్టేషన్‌కు వెళ్లాడు. 
తామిద్దరం ప్రేమించుకుని కులాంతర వివాహం చేసుకున్నామని, ఐదుగురు వ్యక్తులు తమను చంపేస్తామని బెదిరిస్తున్నారంటూ ఫిర్యాదు చేశాడు. వీరి పెళ్లికి కుటుంబసభ్యులే అడ్డుపడుతున్నారనుకున్న పోలీసులు వారిద్దరిని ప్రశ్ని్ంచగా ప్రియా చెప్పింది విని షాకయ్యారు.తాను గతంలో ఐదుగురిని పెళ్లి చేసుకున్నానని, చంద్రుడు తనకు ఆరో భర్తని ప్రియా చెప్పడంతో పోలీసులకు మూడు చెరువులు తాగినంత పనైంది. వారితో కాపురం చేయడం ఇష్టం లేక వదిలేశానని, తనను చంద్రుడు ఎంతో ప్రేమగా 
చూసుకుంటున్నాడని తెలిపింది. అయితే వారిద్దరి మధ్య ఏకంగా 16ఏళ్ల వయస్సు తేడా ఉండటంతో పోలీసులు ప్రియాను మందలించారు. మరోవైపు ప్రియా లేకపోతే తాను చచ్చిపోతానని చంద్రుడు బెదిరింపులకు దిగాడు. ఈ క్రమంలోనే పోలీసులు ప్రియను గతంలో పెళ్లి చేసుకున్న ఐదుగురు వ్యక్తులకు వివరాలు సేకరించి పోలీస్‌స్టేషన్‌కు రప్పించారు.చంద్రుడితో పాటు మిగిలిన వారు కూడా తమకు ప్రియను అప్పగించాలని పోలీసులపై ఒత్తిడి తెచ్చారు. వీరిలో ఒక్కరికి కూడా ప్రియ విడాకులు ఇవ్వలేదని తెలుసుకున్న పోలీసులు ఆమెపై కేసు నమోదు చేసేందుకు సిద్ధమయ్యారు. దీంతో ఆరు భర్తలు ఆమెపై కేసు పెట్టొద్దని వేడుకున్నారు. తమను మోసం చేసిందని ప్రియపై కోపం ఉన్నప్పటికీ ఆమెతోనే కలిసి జీవించాలనుకుంటున్నట్లు చెప్పారు. మరోవైపు తనను ఐదుగురు భర్తలు ప్రేమగా చూసుకోకపోవడం వల్లనే ఆరో పెళ్లి చేసుకున్నట్లు 
పోలీసులకు చెప్పింది. తాను ఎవరినీ హత్యలు చేయలేదని, ప్రేమించే వ్యక్తి కోసం వెతుకులాటలో ఐదుగురిని పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందని వెల్లడించింది. ఆరో భర్త తనను ఎంతగానో ప్రేమిస్తున్నాడని, అతడితో కలిసి ఉంటానని ప్రియ పోలీసులకు చెప్పింది. ఈ కేసులో ఎలా ముందుకెళ్లాలో తెలియక పోలీసులు తలలు పట్టుకున్నారు.

Related Posts