YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

డాక్టర్ కేసులో కుట్ర

డాక్టర్ కేసులో కుట్ర

గుంటూరు, సెప్టెంబర్ 1 
ఏపీలో సంచలనం రేపిన డాక్టర్ సుధాకర్ కేసుపై మంగళవారం ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంలో సీబీఐ కీలక వ్యాఖ్యలు చేసింది. సుధాకర్ కేసులో కుట్రకోణం  దాగి ఉందని లోతుగా దర్యాప్తు చేయాల్సి ఉందని వ్యాఖ్యానించింది. దర్యాప్తునకు మరికొంత సమయం కావాలని కోర్టును కోరగా.. హైకోర్టు రెండు నెలలు సమయం ఇచ్చింది.  నవంబర్ 11 నాటికి తుది నివేదికను సమర్పించాలని తెలియజేసింది. తదుపరి విచారణ నవంబర్ 16 కు వాయిదా వేసింది. డాక్టర్ సుధాకర్ విశాఖ జిల్లా నర్సీపట్నం ప్రభుత్వ  ఆస్పత్రిలో పనిచేస్తున్నాడు. కరోనా సమయంలో ఆస్పత్రిలో మాస్కులు, పీపీఈ కిట్లు లేవంటూ ఆరోపించారు. ఆ తర్వాత ప్రభుత్వం ఆయన్ను సస్పెండ్ చేసింది.. ఈ  నిర్ణయంపై విపక్షాల నుంచి విమర్శలు వచ్చాయి. సుధాకర్‌పై సస్పెన్షన్ ఎత్తేయాలని డిమాండ్ చేశారు. ఆ తర్వాత కొద్దిరోజులు ఆయన కనిపించ లేదు. మళ్లీ మే 16న  విశాఖలో ప్రత్యక్షమయ్యారు. రోడ్డుపై పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని అరెస్ట్ చేశారు. ఆ తర్వాత సుధాకర్‌ మానసిక పరిస్థితి సరిగా లేదని కేజీహెచ్‌ వైద్యులు  చెప్పడంతో.. పోలీసులు ప్రభుత్వ మెంటల్ ఆస్పత్రికి తరలించారు. అయితే డాక్టర్ సుధాకర్‌ విషయంలో విశాఖ పోలీసులు వ్యవహరించిన తీరుపై వీడియోలతో ఏపీ టీడీపీ రాష్ట్ర  మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత హైకోర్టుకు లేఖ రాశారు. దీంతో కోర్టు ఈ లేఖను సుమోటో పిల్‌గా పరిగణించి విచారణ జరిపింది.. అలాగే మరో వ్యక్తి పిటిషన్  దాఖలు చేశారు. అనంతరం కోర్టు ఈ కేసును సీబీఐకి అప్పగించగా దర్యాప్తు జరుగుతోంది.  

Related Posts