YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు తెలంగాణ

నర్సు కిడ్నాప్

నర్సు కిడ్నాప్

హైద్రాబాద్, సెప్టెంబర్ 2
రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో ఓ నర్సు కిడ్నాప్ ఘటన తీవ్ర కలకలం రేపింది. తనను ముగ్గురు వ్యక్తులు కారులో బంధించి లాడ్జికి తీసుకెళ్లి లైంగికంగా వేధించారని రంగమ్మ అనే నర్సు హైదరాబాద్ రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేసింది. నెలరోజుల్లో రెట్టింపు నగదు ఇస్తామని నమ్మించి ఏడాది క్రితం ఆవుల రాజేశ్‌ అనే వ్యక్తి రూ.55 లక్షలు, సింహాచలం అనే వ్యక్తి రూ.15 లక్షలు తన వద్ద నగదు తీసుకుని తిరిగి ఇవ్వకుండా వేధిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు డబ్బులు తిరిగివ్వాలని కోరడంతో రాజేశ్, సింహాచలం కొంతకాలంగా తనను బెదిరిస్తున్నారని బాధితురాలు చెబుతోంది. డబ్బులు తిరిగిచ్చేస్తామని నమ్మించి తనను లాడ్జికి రప్పించిన ఆ ఇద్దరు మరో నలుగురితో కలిసి తనతో అసభ్యంగా ప్రవర్తించారని రంగమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Related Posts