YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

ముందస్తు రిటైర్మెంట్ కు లెక్క ఉంది

ముందస్తు రిటైర్మెంట్ కు లెక్క ఉంది

ముంబై, సెప్టెంబర్ 2
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల ‘ముందస్తు-నిర్బంధ’ పదవీ విరమణపై మోదీ సర్కారు సవివరమైన, స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. కేంద్ర ఉద్యోగులకు సుపరిచితమైన 56(జే)/(ఎల్‌) నిబంధనలను పునరుద్ఘాటిస్తూ, ఒక్కచోట గుదిగుచ్చుతూ... గతవారం ఒక మెమోరాండం జారీ చేసింది. తాజాగా, దీనిపై మరింత స్పష్టతనిచ్చింది. పెన్షన్ నిబంధనల్లోని 50-55 ఏళ్లు నిండిన లేదా 30 ఏళ్ల సర్వీసు పూర్తయినా, వారి పనితీరుపై సమీక్ష తర్వాత ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఎప్పుడైనా ఉద్యోగులను ముందస్తునిర్బంధ పదవీ విరమణ చేయవచ్చని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.రాజ్యాంగ నిబంధన 56(జే)/ (ఎల్‌), సీసీఎస్‌ పెన్షన్‌ రూల్స్‌ 1972లోని 48వ నిబంధన ప్రకారం... పరిస్థితులను బట్టి నియామక అధికారం ఉపయోగకరంగా ఉందని భావిస్తే, మిగతా సేవలో ఎప్పుడైనా మరింత సమీక్షను ఎదుర్కోవలసి ఉంటుంది. ప్రభుత్వ వర్గాల ప్రకారం... ప్రజా ప్రయోజనం, సమర్థ పాలన, ప్రజలకు సత్వర సేవలు అందించడం కోసం ఉద్యోగులకు ముందుగానే రిటైర్‌మెంట్‌ ప్రకటించే విషయంలో కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేకమైన హక్కులున్నాయి.ఇందులో భాగంగా... 30 ఏళ్ల సర్వీసు లేదా 50/55 ఏళ్లు దాటిన ఉద్యోగుల పనితీరును ఎప్పటికప్పుడు సమీక్షిస్తారు. సదరు ఉద్యోగి వ్యక్తిగత సమగ్రత సందేహాస్పదంగా ఉంటే కచ్చితంగా పదవీ విరమణ చేస్తారు. మరో ఏడాదిలోపు పదవీవిరమణ పొందే ఉద్యోగులను కేవలం ‘అసమర్థత’ను సాకుగా చూపి ముందుగా తొలిగించరాదు. శారీరకంగా, మానసికంగా ఒక్కసారిగా తీవ్రమైన మార్పు వస్తే మాత్రం ముందస్తు రిటైర్‌మెంట్‌ ఇవ్వొచ్చు.పదోన్నతులు పొంది కొత్తగా బాధ్యతలు స్వీకరించిన వారిని కూడా కనీసం ఐదేళ్లపాటు కొనసాగనీయాలి. ‘ముందస్తు రిటైర్‌మెంట్‌’పై నిర్ణయం తీసుకునేముందు సదరు ఉద్యోగి సర్వీస్‌ రికార్డు మొత్తాన్ని పరిశీలించాలి. ఏసీఆర్‌/ ఏపీఏఆర్‌పై మాత్రమే ఆధారపడకుండా ఉద్యోగుల పనితీరును ఏ స్థాయి వారు, ఎప్పుడెప్పుడు సమీక్షించాలనే వివరాలను కూడా నిబంధనల్లో వివరించారు. 56(జే) నిబంధనలు కొత్తేమీ కాదు. కానీ, ప్రస్తుతం కేంద్రం ఈ అస్త్రాన్ని విరివిగా వాడటం మొదలుపెట్టింది. ఐఏఎస్, ఐపీఎస్‌లతోపాటు అఖిల భారత సర్వీసు అధికారులు అనేక మందికి ‘నిర్బంధ పదవీ విరమణ’ పేరిట ఇంటికి పంపుతోంది.ఉద్యోగుల తొలగింపు కేంద్రం హక్కు’ అని పునరుద్ఘాటిస్తూ కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆగస్టు 28న ఓ మెమోరాండం జారీ చేయడం గమనార్హం. అంతేకాదు...56(జే) కింద ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వ ఉద్యోగిని తొలగించే హక్కు కేంద్రానికి ఉంటుంది. సుపరిపాలన కోసం అసమర్థులను/పనికిరాని వారిని పక్కన పెట్టాల్సిందే’ అంటూ సుప్రీంకోర్టు వివిధ కేసుల్లో ఇచ్చిన తీర్పులను కూడా ఈ మెమొరాండంలో ప్రస్తావించింది.

Related Posts