YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

దుబ్బాక బరిలో కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ విజయశాంతి?

దుబ్బాక బరిలో కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ విజయశాంతి?

హైదరాబద్ సెప్టెంబర్ 3  
దుబ్బాకలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే సోలిపేట మరణంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ క్రమంలోనే ఎట్టి పరిస్థితుల్లో పోటీలో గట్టిగా నిలబడాలని కాంగ్రెస్ రెడీ అయ్యింది. కాంగ్రెస్ జెండా ఎగురవేసేందుకు వ్యూహాత్మకంగా సాగుతోంది. బలమైన నేతను బరిలోకి దింపి అక్కడ పాగావేయాలని యోచిస్తోందని ప్రచారం సాగుతోంది. ఉమ్మడి మెదక్ జిల్లాలో గతంలో పోటీచేసిన కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ రాములమ్మను దుబ్బాక బరిలో దింపాలని కాంగ్రెస్ వ్యూహరచన చేస్తున్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ అయిన విజయశాంతిని దింపితే గట్టి పోటీని ఇవ్వవచ్చని ఆ స్థానాన్ని కైవసం చేసుకోవచ్చని భావిస్తున్నారు.మాజీ మంత్రి ముత్యం రెడ్డి కాంగ్రెస్ ను వీడడంతో దుబ్బాకలో గట్టి అభ్యర్థి ఆ పార్టీకి లేకుండా పోయారు. ఈ క్రమంలోనే మెదక్ ఎంపీగా గెలిచి ఉమ్మడి మెదక్ జిల్లాపై మంచి పట్టున్న విజయశాంతి అయితే బాగుంటుందని కాంగ్రెస్ భావిస్తోంది. ఆమెకు అనేక గ్రామాల్లో నేతలు ప్రజలతో సత్సంబంధాలున్నాయి.మెదక్ అసెంబ్లీ నుంచి గత ఎన్నికల్లో విజయశాంతి పోటీచేసి ఓడిపోయారు. దుబ్బాకలో గత ఎన్నికల్లో కాంగ్రెస్ రెండో స్థానంలో నిలిచింది. బీజేపీకి మూడో స్థానంలో ఉంది. ఈ క్రమంలోనే గట్టి ప్రత్యర్థి ఉంటే విజయం సాధించవచ్చని కాంగ్రెస్ పార్టీ విజయశాంతిని బరిలో దింపాలని యోచిస్తున్నట్టు సమాచారం.
ఇక బీజేపీ తరుఫున రఘునందన్ రావు బరిలో ఉండే చాన్స్ ఉంది. టీఆర్ఎస్ రామలింగారెడ్డి మృతితో ఆ కుటుంబానికే టికెట్ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది.

Related Posts