హైదరాబాద్ సెప్టెంబర్ 3
మెట్రో రైలు సేవలను పునరుద్ధరించేందుకు కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది. వీటిని కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల మంత్రి హర్దీప్ సింగ్ పూరి విడుదల చేశారు.
మెట్రోస్టేషన్ల ఎంట్రీ పాయింట్ల వద్ద శానిటైజర్ డిస్పెన్సర్లు ఏర్పాటు చేస్తారు.
ప్రయాణికులకు థర్మల్ స్ర్కీనింగ్ చేశాకే స్టేషన్లలోకి అనుమతిస్తారు.
శరీర ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రయాణానికి అనుమతించరు.
గతంలో మాదిరి టికెట్ల కోసం టోకెన్ల జారీ ఉండదు.
ప్రయాణికులు తప్పనిసరిగా స్మార్ట్ కార్డులు, డిజిటల్ పద్ధతులు అనుసరించాలి.
మెట్రో కార్డుల రీచార్జి సైతం డిజిటల్ మాధ్యమంలోనే చేసుకోవాల్సి ఉంటుంది.
మెట్రో స్టేషన్లలో కౌంటర్లు తెరిచే ఉంటాయి. స్మార్ట్ కార్డ్డులు, మెట్రో కార్డులను కౌంటర్లలో కొనుగోలు చేయొచ్చు.
మెట్రో ప్రాంగణంలో, కోచ్లో మాస్క్ ధరించడం తప్పని సరి.
మాస్కులు ధరించని వారికి జరిమానా తప్పదు.
భౌతిక దూరం నిబంధనలు ప్రతి ఒక్కరూ తప్పక పాటించాల్సిందే.
సిట్టింగ్కు, సిట్టింగ్కు మధ్య మీటర్ దూరం తప్పని సరి.
మెట్రోలోని ఎయిర్ కండిషనర్లను క్రమం తప్పకుండా నియంత్రిస్తారు.
మెట్రోస్టేషన్లు ప్లాట్ఫామ్లు, మెట్రో కోచ్ల్లో రద్దీ లేకుండా జాగ్రత్తలు తీసుకుంటారు.
మెట్రో సిబ్బంది, పోలీసులు పౌర రక్షణ వలంటీర్లను రద్దీ నియంత్రణకు వినియోగిస్తారు.
కట్టడి ప్రాంతాల్లో మెట్రో సేవలు అందుబాటులో ఉండవు. క్లోజ్డ్ స్టేషన్లలో రైలు ఆగదు.
మెట్రో స్టేషన్ల పరిశీలన
ఈనెల 7వ తేదీ నుంచి నగరంలో మెట్రో సేవఅలు ప్రారంభమవుతోన్న నేపథ్యంలో హైదరాబాద్ మెట్రో రైలు అధికారులు, ఎల్అండ్టీ మెట్రో అధికారులు పలు మెట్రో స్టేషన్లను బుధవారం పరిశీలించారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం అన్ని మెట్రోస్టేషన్లు, మెట్రో రైళ్లను అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకోనున్నారు. కొవిడ్ నిబంధనలను పాటిస్తూ మెట్రో రైళ్లను నడుపుతామని మెట్రో అధికారులు తెలిపారు.