ప్రస్తుత ఆర్ధిక సంవత్సరానికి గాను ఆంధ్ర బ్యాంకు సావరిన్ గోల్డ్ బాండ్ల సిరీస్-1 ను జారీ చేసింది.ఏప్రిల్ 16 వ తేదీ నుండి 20 వ తేదీ 2018 వరకు ఈ గోల్డ్ బాండ్లను గ్రాము రూ. 3114 గా నిర్ణయించి విక్రయిస్తుంది. డిజిటల్ పద్దతి ద్వారా కనుగోలు చేసే వారికి ఈ ధరఫై రూ.50 రాయితీ కూడా ఇస్తున్నట్లు ఒక్క ప్రకటనలో తెలిపింది. ఈ బాండ్ల ఫై 2.50 శాతం వడ్డీని అర్ధ సంవత్సర కాలానికి ఇచ్చు ప్రాతిపదిక ఫై ఇవ్వనున్నట్లు తెలిపింది, మరియు ఈ పధకం భారతీయులకు మాత్రమే వర్తిస్తుంది. వ్యక్తిగతంగా 1గ్రాము నుండి 4 కిలోల వరకు కోనుగోలు చేసుకోవచ్చును. హెచ్ యు ఎఫ్ లు,ట్రస్ట్ లు మొదలైనవి నాలుగు కిలోల నుండి 20 కిలోల వరకు కనుగోలు చేయవచ్చును. 8 సంవత్సర కాలానికి విక్రయిచబడే ఈ సావరిన్ గోల్డ్ బాండ్లు 5 సంవత్సర కాలానికి రద్దు చేసుకోను సదుపాయం కూడా గలదు.